మీడియా వాళ్లను చూసి మీకో దండం.. నన్నొదిలేయండి బాబోయ్ అంటూ దండం పెట్టేశాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ను మంగళవారం హైదరాబాద్లో విచారించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సైతం విచారణ జరుగుతున్న కార్యాలయానికి వచ్చాడు.
ఆ ఆఫీస్ నుంచి గణేష్ బయటికి వస్తుండటం చూసి మీడియా వాళ్లు పెద్ద ఎత్తున ఆయన్ని చుట్టుముట్టారు. మీరెందుకొచ్చారిక్కడికి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఐతే బండ్ల గణేష్ వారికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. పూరి జగన్నాథ్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాయంత్రం అయినా ఆయన బయటికి రాలేదని తెలిసి ఆయన్ని కలుద్దామని మాత్రమే తాను ఇక్కడికి వచ్చానని.. అంతకుమించి తనకు ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేదని చెబుతూ అమ్మతోడు అంటూ నెత్తిన చెయ్యి పెట్టుకున్నాడు బండ్ల.
పూరీతో మీరు ఇంతకుముందు రెండు సినిమాలు నిర్మించారు కదా దాని గురించి ఈడీ అధికారులు ప్రశ్నించారా.. ఇంతకుముందు మీరు పూరీకి రూ.40 లక్షల ఖరీదైన వాచ్ ఇచ్చారు కదా దాని గురించి అడిగారా అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తుంటే.. అసలు నన్ను వాళ్లు లోపలికి రానిస్తే కదా ఏమైనా అడగడానికి అని ఎదురు ప్రశ్నించాడు బండ్ల.
మీడియా వాళ్లు ఇలాగే ప్రశ్నల మీద ప్రశ్నలేస్తుంటే.. ‘‘మీ మీడియా వాళ్లకో దండం. మీరనుకుంటే ఏమైనా చేయగలరు. దయచేసి నన్నొదిలేయండి మహా ప్రభో’’ అంటూ అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశాడు బండ్ల గణేష్. కాగా ఈడీ అధికారుల విచారణ సందర్భంగా పూరి.. 2015 నుంచి తన బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ సమర్పించినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 1, 2021 11:40 am
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…