మీడియా వాళ్లను చూసి మీకో దండం.. నన్నొదిలేయండి బాబోయ్ అంటూ దండం పెట్టేశాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ను మంగళవారం హైదరాబాద్లో విచారించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సైతం విచారణ జరుగుతున్న కార్యాలయానికి వచ్చాడు.
ఆ ఆఫీస్ నుంచి గణేష్ బయటికి వస్తుండటం చూసి మీడియా వాళ్లు పెద్ద ఎత్తున ఆయన్ని చుట్టుముట్టారు. మీరెందుకొచ్చారిక్కడికి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఐతే బండ్ల గణేష్ వారికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. పూరి జగన్నాథ్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాయంత్రం అయినా ఆయన బయటికి రాలేదని తెలిసి ఆయన్ని కలుద్దామని మాత్రమే తాను ఇక్కడికి వచ్చానని.. అంతకుమించి తనకు ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేదని చెబుతూ అమ్మతోడు అంటూ నెత్తిన చెయ్యి పెట్టుకున్నాడు బండ్ల.
పూరీతో మీరు ఇంతకుముందు రెండు సినిమాలు నిర్మించారు కదా దాని గురించి ఈడీ అధికారులు ప్రశ్నించారా.. ఇంతకుముందు మీరు పూరీకి రూ.40 లక్షల ఖరీదైన వాచ్ ఇచ్చారు కదా దాని గురించి అడిగారా అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తుంటే.. అసలు నన్ను వాళ్లు లోపలికి రానిస్తే కదా ఏమైనా అడగడానికి అని ఎదురు ప్రశ్నించాడు బండ్ల.
మీడియా వాళ్లు ఇలాగే ప్రశ్నల మీద ప్రశ్నలేస్తుంటే.. ‘‘మీ మీడియా వాళ్లకో దండం. మీరనుకుంటే ఏమైనా చేయగలరు. దయచేసి నన్నొదిలేయండి మహా ప్రభో’’ అంటూ అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశాడు బండ్ల గణేష్. కాగా ఈడీ అధికారుల విచారణ సందర్భంగా పూరి.. 2015 నుంచి తన బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ సమర్పించినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 1, 2021 11:40 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…