Movie News

బాండ్ వచ్చేస్తున్నాడహో..

కరోనా మహమ్మారి పుణ్యమా అని ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న సినిమాలు నెలలు, సంవత్సరాలు వాయిదా పడిపోతున్నాయి. ఈ వైరస్ ధాటికి ప్రపంచమంతా ప్రభావితం కావడంతో అన్ని సినీ పరిశ్రమలూ కుదేలయ్యాయి. హాలీవుడ్ సైతం కరోనా ధాటికి విలవిలలాడింది. ఎప్పుడో 2020 వేసవికే రావాల్సిన జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైం టు డై’.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌ల తర్వాత ఈ సినిమాను విడుదల చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ‘నో టైం టు డై’ని రిలీజ్ చేయడానికి నిర్మాణ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఈసారి కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా.. ట్రైలర్ సైతం లాంచ్ చేసింది.

ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో నడవట్లేదు. అయినా సరే.. మరోసారి బాండ్ మూవీని వాయిదా వేయాలని మేకర్స్ అనుకోవట్లేదు. ‘నో టైం టు డై’ ట్రైలర్ చూస్తే యాక్షన్ ప్రియులకు, బాండ్ సినిమా లవర్స్‌కు కనువిందు ఖాయమనిపిస్తోంది. కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలతో ట్రైలర్ వారెవా అనిపించింది. కథ పెద్దగా రివీల్ కాలేదు కానీ.. బాండ్ గారి కొత్త మిషన్ చాలా ఎగ్జైటింగ్‌గానే ఉండబోతోందని అర్థమవుతోంది.

‘టెనెట్’ సహా గత ఏడాది వ్యవధిలో వచ్చిన భారీ హాలీవుడ్ చిత్రాలు చాలా వాటికి ఆశించిన వసూళ్లు రాలేదు. మరి బాండ్ మూవీ ప్రతికూల పరిస్థితుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి. 2006లో ‘క్యాసినో రాయల్’తో బాండ్ అవ‌తారం ఎత్తి.. ఆ తర్వాత ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, ‘స్కై ఫాల్’, ‘స్పెక్టర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించిన డేనియ‌ల్ క్రెయిగ్‌కు బాండ్ పాత్రలో ‘నో టైం టు డై’నే చివరి సినిమాగా భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేరీ జోజి రూపొందించాడు.

This post was last modified on September 1, 2021 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

5 minutes ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

1 hour ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

2 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

3 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

3 hours ago

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు.…

3 hours ago