Movie News

ఆచార్య.. మధ్యే మార్గం

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఆ చిత్రం మే 13నే విడుదల కావాల్సింది. కానీ వైరస్ మరోసారి విజృంభించడంతో చాలా సినిమాల్లాగే ఇది కూడా వాయిదా పడింది.

సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత షూటింగ్ పున:ప్రారంభించి బ్యాలెన్స్ పార్ట్ పూర్తి చేసినప్పటికీ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా స్పష్టత రావట్లేదు. ముందేమో దసరా రిలీజ్ అన్నారు కానీ.. గత కొన్ని రోజుల పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.

‘ఆచార్య’ సంక్రాంతికి వస్తుందని.. కాదు కాదు క్రిస్మస్ రేసులో నిలవబోతోందని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఐతే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’.. క్రిస్మస్‌కు అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’ రిలీజవుతుండగా.. వాటికి పోటీగా చిరు తన చిత్రాన్ని రేసులో నిలిపి వివాదానికి కారణమవుతాడని అనుకోలేం. వీలైనంత వరకు దసరా రిలీజ్‌కే ప్రయత్నిద్దామనుకున్నారు కానీ.. అప్పటికి ‘ఆచార్య’ను సిద్ధం చేయడం కష్టమేనట.

అందుకే మధ్యే మార్గంగా టాలీవుడ్ ఎప్పుడూ అంతగా దృష్టిపెట్టని మరో పండుగ మీద ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. నవంబరు తొలి వారంలో దీపావళి కానుకగా ‘ఆచార్య’ను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం చూస్తోందట. దీపావళికి తమిళం, హిందీ భాషల్లో భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. హిందీ మార్కెట్ ఇంకా పుంజుకోకపోవడంతో ఈసారి దీపావళికి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజయ్యేలా లేవు.

తమిళంలో మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘అన్నాత్తె’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ చిత్రం తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది. మరి చిరు దీపావళికి ఫిక్సయితే.. రజినీతో తలపడబోతున్నాడన్నమాట. చిరు వెర్సస్ రజినీ.. ఎవ్వరూ ఊహించని ఈ బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

This post was last modified on August 31, 2021 9:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

12 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

12 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

12 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

15 hours ago