ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవారికే విలువ. ఒక్కసారి హిట్ పడిందంటే చాలు వరుస అవకాశాలు వస్తుంటాయి. అదే ప్లాప్ పడితే మాత్రం ఇక అంతే సంగతులు. అయితే సూపర్ హిట్ ఇచ్చిన ఓ డైరెక్టర్ ఇప్పుడు ఖాళీగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లాంటి తారలను ఇండస్ట్రీకి అందించారు.
ఇంత చేసినా.. కూడా ఇప్పటివరకు బుచ్చిబాబు రెండో సినిమా అనౌన్స్ చేయలేదు. ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకొని ఆయనకు వినిపించారు. కానీ ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్స్ వలన వీరి కాంబో ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో తన తొలి హీరో వైష్ణవ్ తేజ్ తోనే సినిమా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. మైత్రి మూవీస్ బ్యానర్ లోనే వైష్ణవ్ హీరో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా బిజీ అయిపోయారు. తను నటించిన ‘కొండపొలెం’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ లో మరో సినిమా చేయాల్సివుంది. ఇది కాకుండా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇలా రెండు, మూడు సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నారు. వీటి మధ్య బుచ్చిబాబుకి డేట్స్ ఇవ్వడం వైష్ణవ్ కి కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు మరో యంగ్ హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు. మరి తన కథకు సూటయ్యే హీరో దొరుకుతాడో లేదో చూడాలి!
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ లెగసీని…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…