ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవారికే విలువ. ఒక్కసారి హిట్ పడిందంటే చాలు వరుస అవకాశాలు వస్తుంటాయి. అదే ప్లాప్ పడితే మాత్రం ఇక అంతే సంగతులు. అయితే సూపర్ హిట్ ఇచ్చిన ఓ డైరెక్టర్ ఇప్పుడు ఖాళీగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లాంటి తారలను ఇండస్ట్రీకి అందించారు.
ఇంత చేసినా.. కూడా ఇప్పటివరకు బుచ్చిబాబు రెండో సినిమా అనౌన్స్ చేయలేదు. ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకొని ఆయనకు వినిపించారు. కానీ ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్స్ వలన వీరి కాంబో ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో తన తొలి హీరో వైష్ణవ్ తేజ్ తోనే సినిమా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. మైత్రి మూవీస్ బ్యానర్ లోనే వైష్ణవ్ హీరో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా బిజీ అయిపోయారు. తను నటించిన ‘కొండపొలెం’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ లో మరో సినిమా చేయాల్సివుంది. ఇది కాకుండా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇలా రెండు, మూడు సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నారు. వీటి మధ్య బుచ్చిబాబుకి డేట్స్ ఇవ్వడం వైష్ణవ్ కి కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు మరో యంగ్ హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు. మరి తన కథకు సూటయ్యే హీరో దొరుకుతాడో లేదో చూడాలి!
This post was last modified on August 31, 2021 9:09 pm
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…
ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్బస్టర్ కొట్టి దశాబ్దం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…