ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవారికే విలువ. ఒక్కసారి హిట్ పడిందంటే చాలు వరుస అవకాశాలు వస్తుంటాయి. అదే ప్లాప్ పడితే మాత్రం ఇక అంతే సంగతులు. అయితే సూపర్ హిట్ ఇచ్చిన ఓ డైరెక్టర్ ఇప్పుడు ఖాళీగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లాంటి తారలను ఇండస్ట్రీకి అందించారు.
ఇంత చేసినా.. కూడా ఇప్పటివరకు బుచ్చిబాబు రెండో సినిమా అనౌన్స్ చేయలేదు. ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకొని ఆయనకు వినిపించారు. కానీ ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్స్ వలన వీరి కాంబో ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో తన తొలి హీరో వైష్ణవ్ తేజ్ తోనే సినిమా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. మైత్రి మూవీస్ బ్యానర్ లోనే వైష్ణవ్ హీరో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా బిజీ అయిపోయారు. తను నటించిన ‘కొండపొలెం’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ లో మరో సినిమా చేయాల్సివుంది. ఇది కాకుండా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇలా రెండు, మూడు సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నారు. వీటి మధ్య బుచ్చిబాబుకి డేట్స్ ఇవ్వడం వైష్ణవ్ కి కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు మరో యంగ్ హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు. మరి తన కథకు సూటయ్యే హీరో దొరుకుతాడో లేదో చూడాలి!
This post was last modified on August 31, 2021 9:09 pm
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…