ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవారికే విలువ. ఒక్కసారి హిట్ పడిందంటే చాలు వరుస అవకాశాలు వస్తుంటాయి. అదే ప్లాప్ పడితే మాత్రం ఇక అంతే సంగతులు. అయితే సూపర్ హిట్ ఇచ్చిన ఓ డైరెక్టర్ ఇప్పుడు ఖాళీగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లాంటి తారలను ఇండస్ట్రీకి అందించారు.
ఇంత చేసినా.. కూడా ఇప్పటివరకు బుచ్చిబాబు రెండో సినిమా అనౌన్స్ చేయలేదు. ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకొని ఆయనకు వినిపించారు. కానీ ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్స్ వలన వీరి కాంబో ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో తన తొలి హీరో వైష్ణవ్ తేజ్ తోనే సినిమా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. మైత్రి మూవీస్ బ్యానర్ లోనే వైష్ణవ్ హీరో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా బిజీ అయిపోయారు. తను నటించిన ‘కొండపొలెం’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ లో మరో సినిమా చేయాల్సివుంది. ఇది కాకుండా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇలా రెండు, మూడు సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నారు. వీటి మధ్య బుచ్చిబాబుకి డేట్స్ ఇవ్వడం వైష్ణవ్ కి కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు మరో యంగ్ హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు. మరి తన కథకు సూటయ్యే హీరో దొరుకుతాడో లేదో చూడాలి!
This post was last modified on August 31, 2021 9:09 pm
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…