మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం విరామం తర్వాత నాలుగేళ్ల కిందట సినిమాల్లోకి పునరాగమనం చేశారు. రీఎంట్రీ సినిమా కోసం రెండు మూడేళ్ల పాటు కసరత్తు జరిగింది. ఏవేవో కథలు అనుకుని చివరికి తమిళ బ్లాక్బస్టర్ ‘కత్తి’ని రీమేక్ చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇది మెజారిటీ అభిమానులకు రుచించలేదు.
ఈ సినిమా మంచి విజయమే సాధించి ఉండొచ్చు కానీ.. చిరును ఒక ఒరిజినల్ స్టోరీతోనే మళ్లీ సినిమాల్లో చూడాలని అభిమానులు ఆశించారు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’ లాంటి ఒరిజినల్ సినిమాలు చేయడం వారికి ఆనందాన్నిచ్చింది. కానీ తర్వాత మళ్లీ ఆయన రీమేక్ చేయడానికి రెడీ అయిపోయారు. అదే.. లూసిఫర్. తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమాను చిరు రీమేక్ చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తినా ఆయన వెనక్కి తగ్గలేదు.
అది చాలదన్నట్లు ‘వేదాళం’ రీమేక్నూ లైన్లో పెట్టారు. పైగా దీనికి అసలేమాత్రం ఫాంలో లేని మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ సినిమా విషయంలో అభిమానుల వ్యతిరేకత మామూలుగా లేదు. ఐతే తాము వ్యతిరేకిస్తే సినిమా ఆగదని అర్థమై ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. వాస్తవాన్ని అంగీకరించి ఊరుకున్నారు.
కానీ చిరంజీవి అంతటితో ఆగకుండా మరో రీమేక్ను తెరపైకి తేవడం అభిమానులకు అసలేమాత్రం రుచించడం లేదు. అజిత్ మూవీ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్లో నటించడానికి చిరు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కూడా తెలుగులోకి అనువాదం అయింది. యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. ఇలాంటి సినిమాను ఇప్పుడు చిరు రీమేక్ చేయాల్సిన అవసరమేంటన్నది ప్రశ్న.
అమితాబ్ బచ్చన్ లాగా కాస్త భిన్నమైన కథలతో ప్రయాణం చేస్తూ తన ప్రత్యేకతను చాటుకోవాల్సిన సమయంలో చిరు ఇలా రీమేక్లను పట్టుకుని వేలాడ్డమేంటో అంతుబట్టడం లేదు. పైగా ఆయన ఎక్కువగా రొటీన్ మాస్ మసాలా సినిమాలకే ఓటేస్తున్నారు. అభిమానుల ఆకాంక్షలకు విరుద్ధంగా చిరు అడుగులు వేస్తున్న సంగతి స్పష్టం. ఇప్పటికే మొదలైన సినిమాల విషయంలో ఏం చేయలేం కానీ.. కనీసం ‘ఎన్నై అరిందాల్’ విషయంలో అయినా ఆయన పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on August 31, 2021 3:53 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…