అక్కినేని నాగచైతన్యకు సూటయ్యే బెస్ట్ రోల్ అంటే.. లవర్ బాయ్మే. అతను కెరీర్లో మెజారిటీ విజయాలందుకుంది ప్రేమకథలతోనే. ఐతే ఫక్తు ప్రేమకథలతో సరిపెట్టుకుండా వాటికి కొంచెం స్లైస్ ఆఫ్ లైఫ్ టచ్ ఇవ్వడం ద్వారా అతను మంచి ఫలితాలు అందుకుంటున్నాడు.
మలయాళ రీమేక్ ‘ప్రేమమ్’ ఆ టైపు సినిమానే. ‘మజిలీ’లో కూడా కొంచెం అలాంటి టచ్ ఉంటుంది. ఐతే ‘ప్రేమమ్’ చైతూకు బాగా సెట్ అయిన సినిమా. ఇలాంటి కథలతో సినిమాలు చేస్తే భాషతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. మెజారిటీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటించిన ‘థ్యాంక్ యు’ అచ్చంగా అలాంటి సినిమానేనట. ఇందులో ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశల్లోని పరిణామాలను చూపించబోతున్నారట. లవ్ టచ్ ఇస్తూనే జీవిత సారాన్ని తెలిపేలా ఈ సినిమా నడుస్తుందట.
అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ట్విట్టర్ స్పేస్లో పాల్గొన్న ‘థ్యాంక్ యు’ రైటర్ బీవీఎస్ రవి.. ఈ సినిమాలో చైతూ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో వివరించాడు. చైతూ ఇందులో మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో.. డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తాడని వెల్లడించాడు.
ముందుగా కాలేజీ రోజుల్లో స్టూడెంట్ లీడర్గా చైతూ కనిపిస్తాడని… ఆ తర్వాత జీవితం మీద గొప్ప కలలు కనే యువకుడిగా కనిపిస్తాడని.. ఆపై పరిణితి చెందిన మధ్య వయస్కుడిగా దర్శనమిస్తాడని.. ఒక వ్యక్తి జీవితాన్ని వివిధ కోణాల్లో చూపించే సినిమా ఇదని రవి వెల్లడించాడు. ఈ మాటలు వినగానే ‘ఆటోగ్రాఫ్’, ‘ప్రేమమ్’ సినిమాలు గుర్తుకు రావడం సహజం.
తమిళ రీమేక్ అయిన ‘ఆటోగ్రాఫ్’ చాలా మంచి సినిమా అయినా అది తెలుగులో సరిగా ఆడలేదు. ‘ప్రేమమ్’ మాత్రం రీమేక్ చేస్తున్నపుడు నెగెటివిటీ ఎదుర్కొన్నప్పటికీ మంచి ఫలితాన్నే దక్కించుకుంది. మరి ‘థ్యాంక్ యు’ కూడా చైతూకు మరో మరపురాని సినిమా అవుతుందేమో చూడాలి.
This post was last modified on August 31, 2021 7:16 am
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…