అక్కినేని నాగచైతన్యకు సూటయ్యే బెస్ట్ రోల్ అంటే.. లవర్ బాయ్మే. అతను కెరీర్లో మెజారిటీ విజయాలందుకుంది ప్రేమకథలతోనే. ఐతే ఫక్తు ప్రేమకథలతో సరిపెట్టుకుండా వాటికి కొంచెం స్లైస్ ఆఫ్ లైఫ్ టచ్ ఇవ్వడం ద్వారా అతను మంచి ఫలితాలు అందుకుంటున్నాడు.
మలయాళ రీమేక్ ‘ప్రేమమ్’ ఆ టైపు సినిమానే. ‘మజిలీ’లో కూడా కొంచెం అలాంటి టచ్ ఉంటుంది. ఐతే ‘ప్రేమమ్’ చైతూకు బాగా సెట్ అయిన సినిమా. ఇలాంటి కథలతో సినిమాలు చేస్తే భాషతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. మెజారిటీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటించిన ‘థ్యాంక్ యు’ అచ్చంగా అలాంటి సినిమానేనట. ఇందులో ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశల్లోని పరిణామాలను చూపించబోతున్నారట. లవ్ టచ్ ఇస్తూనే జీవిత సారాన్ని తెలిపేలా ఈ సినిమా నడుస్తుందట.
అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ట్విట్టర్ స్పేస్లో పాల్గొన్న ‘థ్యాంక్ యు’ రైటర్ బీవీఎస్ రవి.. ఈ సినిమాలో చైతూ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో వివరించాడు. చైతూ ఇందులో మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో.. డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తాడని వెల్లడించాడు.
ముందుగా కాలేజీ రోజుల్లో స్టూడెంట్ లీడర్గా చైతూ కనిపిస్తాడని… ఆ తర్వాత జీవితం మీద గొప్ప కలలు కనే యువకుడిగా కనిపిస్తాడని.. ఆపై పరిణితి చెందిన మధ్య వయస్కుడిగా దర్శనమిస్తాడని.. ఒక వ్యక్తి జీవితాన్ని వివిధ కోణాల్లో చూపించే సినిమా ఇదని రవి వెల్లడించాడు. ఈ మాటలు వినగానే ‘ఆటోగ్రాఫ్’, ‘ప్రేమమ్’ సినిమాలు గుర్తుకు రావడం సహజం.
తమిళ రీమేక్ అయిన ‘ఆటోగ్రాఫ్’ చాలా మంచి సినిమా అయినా అది తెలుగులో సరిగా ఆడలేదు. ‘ప్రేమమ్’ మాత్రం రీమేక్ చేస్తున్నపుడు నెగెటివిటీ ఎదుర్కొన్నప్పటికీ మంచి ఫలితాన్నే దక్కించుకుంది. మరి ‘థ్యాంక్ యు’ కూడా చైతూకు మరో మరపురాని సినిమా అవుతుందేమో చూడాలి.
This post was last modified on August 31, 2021 7:16 am
నిన్న వారం విడుదలైన గోదారి గట్టుపైనకు మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. తండ్రి కూతురి ఎమోషన్ ని తీసుకుని…
ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ…
టాలీవుడ్లో హీరోలు దర్శకులవడం కొత్త కాదు కానీ.. ఈ జాబితా మరీ పెద్దదేమీ కాదు. తాజాగా యువ కథానాయకుడు రామ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పెద్ది మీద అంచనాలు ఏ…
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో…
ప్రస్తుతం పొదుపు మంత్రం పఠిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సహా బంగారం వంటివాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పరిధిలో…