బాలీవుడ్ బాధ రోజు రోజుకూ పెరిగిపోతోంది. హిందీ చిత్రాల భవిష్యత్ పట్ల ఆందోళన అంతకంతకూ ఎక్కువవుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కొట్టిన దెబ్బకు బాలీవుడ్ మామూలుగా దెబ్బ తినలేదు. ఏడాదికి పైగా థియేటర్ల నుంచి అసలు రెవెన్యూ అన్నదే లేకపోయింది. సెకండ్ వేవ్ తర్వాత అయినా పరిస్థితులు మారతాయేమో అనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. ఈ మధ్యనే అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ మూవీని భారీ స్థాయిలో విడుదల చేశారు.
కానీ ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ సినిమాలకు మామూలుగా తొలి రోజు వచ్చే వసూళ్లు కూడా ఈ చిత్రానికి ఫుల్ రన్లో రాని పరిస్థితి. ఆ రిజల్ట్ చూసి బాలీవుడ్ రివైవల్ ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ‘బెల్ బాటమ్’కు సానుకూల ఫలితం వస్తే మరిన్ని చిత్రాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు కానీ.. దానికి నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో అందులో చాలా మంది వెనక్కి తగ్గారు.
ఐతే ఈ పరిస్థితుల్లోనూ ధైర్యం చేసి ‘చెహ్రె’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషించిన థ్రిల్లర్ మూవీ ఇది. కామెడీ చిత్రాలకు పేరుపడ్డ రుమీ జాఫ్రీ తన శైలికి భిన్నంగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 3 ప్లస్ రేటింగ్సే ఇచ్చారు సమీక్షకులందరూ. 3.5-4 రేటింగ్స్ కూడా పడ్డాయి. స్క్రిప్టు గురించి.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ల గురించి సినిమా చూసిన వాళ్లందరూ గొప్పగా మాట్లాడుతున్నారు.
ఐతే ఇంత పాజిటివ్ రివ్యూలు, ఫీడ్ బ్యాక్ వచ్చినా.. అది బాక్సాఫీస్ రిజల్ట్లో ప్రతిఫలించడం లేదు. తొలి రోజు దేశ వ్యాప్తంగా కేవలం రూ.50 లక్షల వసూళ్లు వచ్చాయంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. అమితాబ్ లాంటి నటుడి సినిమాకు ఇది పరాభవం అనే చెప్పాలి. వారాంతంలో కూడా వసూళ్లు పెద్దగా పుంజుకోలేదు. హిందీ ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే మూడ్లోకి రాలేదని ఈ చిత్రంతో మరోసారి రుజువైంది. దీంతో ఇప్పుడిప్పుడే మళ్లీ పేరున్న సినిమాలను రిలీజ్ చేసే సాహసం బాలీవుడ్ నిర్మాతలు చేయరేమో.
This post was last modified on August 30, 2021 8:27 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…