Movie News

‘బిగ్ బి’ సినిమాకు పరాభవం

బాలీవుడ్ బాధ రోజు రోజుకూ పెరిగిపోతోంది. హిందీ చిత్రాల భవిష్యత్ పట్ల ఆందోళన అంతకంతకూ ఎక్కువవుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కొట్టిన దెబ్బకు బాలీవుడ్ మామూలుగా దెబ్బ తినలేదు. ఏడాదికి పైగా థియేటర్ల నుంచి అసలు రెవెన్యూ అన్నదే లేకపోయింది. సెకండ్ వేవ్ తర్వాత అయినా పరిస్థితులు మారతాయేమో అనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. ఈ మధ్యనే అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ మూవీని భారీ స్థాయిలో విడుదల చేశారు.

కానీ ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ సినిమాలకు మామూలుగా తొలి రోజు వచ్చే వసూళ్లు కూడా ఈ చిత్రానికి ఫుల్ రన్లో రాని పరిస్థితి. ఆ రిజల్ట్ చూసి బాలీవుడ్ రివైవల్ ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ‘బెల్ బాటమ్’కు సానుకూల ఫలితం వస్తే మరిన్ని చిత్రాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు కానీ.. దానికి నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో అందులో చాలా మంది వెనక్కి తగ్గారు.

ఐతే ఈ పరిస్థితుల్లోనూ ధైర్యం చేసి ‘చెహ్రె’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. బిగ్ బి అమితాబ్‌ బచ్చన్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషించిన థ్రిల్లర్ మూవీ ఇది. కామెడీ చిత్రాలకు పేరుపడ్డ రుమీ జాఫ్రీ తన శైలికి భిన్నంగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 3 ప్లస్ రేటింగ్సే ఇచ్చారు సమీక్షకులందరూ. 3.5-4 రేటింగ్స్ కూడా పడ్డాయి. స్క్రిప్టు గురించి.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్‌ల గురించి సినిమా చూసిన వాళ్లందరూ గొప్పగా మాట్లాడుతున్నారు.

ఐతే ఇంత పాజిటివ్ రివ్యూలు, ఫీడ్ బ్యాక్ వచ్చినా.. అది బాక్సాఫీస్ రిజల్ట్‌లో ప్రతిఫలించడం లేదు. తొలి రోజు దేశ వ్యాప్తంగా కేవలం రూ.50 లక్షల వసూళ్లు వచ్చాయంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. అమితాబ్ లాంటి నటుడి సినిమాకు ఇది పరాభవం అనే చెప్పాలి. వారాంతంలో కూడా వసూళ్లు పెద్దగా పుంజుకోలేదు. హిందీ ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే మూడ్‌లోకి రాలేదని ఈ చిత్రంతో మరోసారి రుజువైంది. దీంతో ఇప్పుడిప్పుడే మళ్లీ పేరున్న సినిమాలను రిలీజ్ చేసే సాహసం బాలీవుడ్ నిర్మాతలు చేయరేమో.

This post was last modified on August 30, 2021 8:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

2 hours ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

4 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

4 hours ago

గట్టు మీదున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా

ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…

6 hours ago

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…

7 hours ago

జియో ఉంది… పెద్దికి టెన్ష‌న్ లేదు

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం కంటే దాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవ‌డం స‌వాలుగా మారింది. తెలుగులో…

8 hours ago