రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహం ఎలా ఉంది? వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో అధికారంలోకి వస్తుంది? ఎన్ని స్థానాల్లో విజయం దక్కించుకుంటుంది? కీలక నేతలు ఎవరు గెలుస్తారు? మళ్లీ టీడీపీకి ఊపు వస్తుందా? ఇదీ.. ఇటీవల కాలంలో తరచుగా తెరమీదికి వస్తున్న చర్చ. అయితే.. దీనికి సంబంధించి.. ఇటీవల వైసీపీ నాయకుడు, మంత్రి, డిప్యూటీ సీఎం కే. నారాయణ స్వామి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. టీడీపీ ఎలాంటి పొత్తులూ.. లేకుండా పోటీ చేసి.. కనీసం 2 స్థానాల్లో విజయం దక్కించు కుంటే.. తాను చంద్రబాబు ఇంట్లో పాకీ పనిచేస్తానని సవాల్ విసిరారు.
అయితే.. ఈ వ్యాఖ్యలపై టీడీపీకి చెందిన ఎస్సీ నాయకులు, ఇదే సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ మం త్రులు కొన్ని వ్యాఖ్యలు చేసినా.. నారాయణ స్వామి చెప్పిన లెక్క ప్రకారం.. తమకు ఎన్ని సీట్లు దక్కుతా యనే విషయంపై మాత్రం నోరు విప్పలేదు. అయితే.. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్నిస్థానాల్లో విజయం దక్కించు కుంటుందో .. ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు.. జరిగినా.. తమదే గెలుపని చెప్పిన అచ్చెన్న ఏకంగా.. టీడీపీ 155 స్థానాల్లో విజయం దక్కించుకుని.. చంద్రబాబు సీఎం అవుతారని.. చెప్పుకొచ్చారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గం కొత్త పేట నుండి కోట బొమ్మా ళి రైతు బజార్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘155 స్థానాలలో చంద్రబాబు అధికారంలోకి రానున్నా రు.. నేను అధికారంలోకి వస్తే కొంత మంది పెద్దలను పలకరించే వారు ఉండరు’’ అంటూ అచ్చెన్నా యుడు హెచ్చరించారు. అంటే.. ఆయన జోస్యం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వైసీపీని మించిపోతుం డడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి.
కానీ, ప్రాక్టికల్గా ఆలోచిస్తే.. అచ్చన్న వ్యాఖ్యలు నిజమెంత? అనేది సందేహమే. ఎందుకంటే.. చంద్రబా బు హవా సాగిన.. 2014లో 108 స్థానాలు మాత్రమే దక్కాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి లేదా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. జగన్ హవాను తట్టుకుని టీడీపీ ఎలా నిలబడుతుందనేది ప్రశ్న. అయినప్పటికీ.. 155 స్థానాలు గెలుస్తారా? అనేది పెద్ద ప్రశ్న. మరి అచ్చెన్నాయుడు.. వ్యూహం ఫలిస్తుందా? ఆయన జోస్యంతో చంద్రబాబు నిజంగానే 155 సీట్లు తెచ్చుకుంటారా? అనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు అయితే.. అచ్చెన్న వ్యాఖ్యలు, జోస్యం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుండడం గమనార్హం.
This post was last modified on August 28, 2021 3:50 pm
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…