టాలీవుడ్ లో హీరోలంతా ఇప్పుడు యమా జోరుమీదున్నారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో దర్శకనిర్మాతలకు హీరోలు దొరకడం లేదు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా బాగా బిజీ అయిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్లు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. సీనియర్ హీరోలే నాలుగైదు సినిమాలు పట్టాలెక్కిస్తుంటే ఇక కుర్ర హీరోలు ఇంకెంత స్పీడ్ గా ఉండాలి చెప్పండి. కానీ యంగ్ హీరో నిఖిల్ పరిస్థితి మాత్రం అలా లేదు.
2018లో నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత ‘అర్జున్ సురవరం’ రిలీజైనా.. అది రెండేళ్లు పాటు ల్యాబ్ లోనే ఉండిపోయి బయటకొచ్చింది సినిమా. ఆ లెక్కన చూసుకుంటే ఈ మూడేళ్లలో నిఖిల్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కొన్నాళ్లుగా ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ దర్శకుడు సూర్యప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ లో చాలా ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యానికి కారణం నిఖిల్ కానప్పటికీ.. ఆ ఎఫెక్ట్ మాత్రం నిఖిల్ కెరీర్ పై పడుతోంది. ’18 పేజెస్’ సినిమా విడుదలై.. రిజల్ట్ తేలేవరకు మరో సినిమా ఒప్పుకోకూడదని అనుకుంటున్నాడు నిఖిల్. కానీ ఆ సినిమా మాత్రం పూర్తి కావడం లేదు. మొన్నామధ్య రీషూట్ కూడా చేశారు. అందుకే.. అనుకున్నదానికంటే ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో తొలిసారి నిఖిల్ తో రొమాన్స్ చేయబోతుంది అనుపమ పరమేశ్వరన్.
This post was last modified on August 28, 2021 11:01 am
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…