టాలీవుడ్ లో హీరోలంతా ఇప్పుడు యమా జోరుమీదున్నారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో దర్శకనిర్మాతలకు హీరోలు దొరకడం లేదు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా బాగా బిజీ అయిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్లు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. సీనియర్ హీరోలే నాలుగైదు సినిమాలు పట్టాలెక్కిస్తుంటే ఇక కుర్ర హీరోలు ఇంకెంత స్పీడ్ గా ఉండాలి చెప్పండి. కానీ యంగ్ హీరో నిఖిల్ పరిస్థితి మాత్రం అలా లేదు.
2018లో నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత ‘అర్జున్ సురవరం’ రిలీజైనా.. అది రెండేళ్లు పాటు ల్యాబ్ లోనే ఉండిపోయి బయటకొచ్చింది సినిమా. ఆ లెక్కన చూసుకుంటే ఈ మూడేళ్లలో నిఖిల్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కొన్నాళ్లుగా ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ దర్శకుడు సూర్యప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ లో చాలా ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యానికి కారణం నిఖిల్ కానప్పటికీ.. ఆ ఎఫెక్ట్ మాత్రం నిఖిల్ కెరీర్ పై పడుతోంది. ’18 పేజెస్’ సినిమా విడుదలై.. రిజల్ట్ తేలేవరకు మరో సినిమా ఒప్పుకోకూడదని అనుకుంటున్నాడు నిఖిల్. కానీ ఆ సినిమా మాత్రం పూర్తి కావడం లేదు. మొన్నామధ్య రీషూట్ కూడా చేశారు. అందుకే.. అనుకున్నదానికంటే ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో తొలిసారి నిఖిల్ తో రొమాన్స్ చేయబోతుంది అనుపమ పరమేశ్వరన్.
This post was last modified on August 28, 2021 11:01 am
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…