టాలీవుడ్ లో హీరోలంతా ఇప్పుడు యమా జోరుమీదున్నారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో దర్శకనిర్మాతలకు హీరోలు దొరకడం లేదు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా బాగా బిజీ అయిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్లు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. సీనియర్ హీరోలే నాలుగైదు సినిమాలు పట్టాలెక్కిస్తుంటే ఇక కుర్ర హీరోలు ఇంకెంత స్పీడ్ గా ఉండాలి చెప్పండి. కానీ యంగ్ హీరో నిఖిల్ పరిస్థితి మాత్రం అలా లేదు.
2018లో నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత ‘అర్జున్ సురవరం’ రిలీజైనా.. అది రెండేళ్లు పాటు ల్యాబ్ లోనే ఉండిపోయి బయటకొచ్చింది సినిమా. ఆ లెక్కన చూసుకుంటే ఈ మూడేళ్లలో నిఖిల్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కొన్నాళ్లుగా ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ దర్శకుడు సూర్యప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ లో చాలా ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యానికి కారణం నిఖిల్ కానప్పటికీ.. ఆ ఎఫెక్ట్ మాత్రం నిఖిల్ కెరీర్ పై పడుతోంది. ’18 పేజెస్’ సినిమా విడుదలై.. రిజల్ట్ తేలేవరకు మరో సినిమా ఒప్పుకోకూడదని అనుకుంటున్నాడు నిఖిల్. కానీ ఆ సినిమా మాత్రం పూర్తి కావడం లేదు. మొన్నామధ్య రీషూట్ కూడా చేశారు. అందుకే.. అనుకున్నదానికంటే ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో తొలిసారి నిఖిల్ తో రొమాన్స్ చేయబోతుంది అనుపమ పరమేశ్వరన్.
This post was last modified on August 28, 2021 11:01 am
ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోయి జనాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. వరసబెట్టి దింపుతుంటే వాళ్ళు మాత్రం ఏం…
కొత్త సినిమాలు వస్తున్నా బాక్సాఫీస్ కు ఎలాంటి ఉత్సాహం కలగడం లేదు. కారణం కనీసం యావరేజ్ అనిపించుకున్నవి కూడా లేకపోవడమే.…
ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. "సొంత చెల్లెలు కట్టుబొట్టుతో బాగుండాలని సగటు…
ఇప్పుడు ఇండియా మొత్తం ఒక సినిమా రిలీజ్ డేట్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అదే.. పాన్ ఇండియా…
ఈ మధ్య కాలంలో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్కు గురైన సినిమా అంటే.. ఫ్యామిలీ స్టార్ అనే చెప్పాలి. ఈ…
ఒక హీరోయిన్ ముందు ఒకరితో రిలేషన్షిప్లోకి వెళ్లడం.. ఆ తర్వాత అతణ్నుంచి విడిపోయి కొత్త బాయ్ఫ్రెండ్ను వెతుక్కోవడం.. మళ్లీ బ్రేకప్…