Movie News

లాక్ డౌన్ స్టోరీతో ‘పాగల్’ హీరో!

దేశంలో కరోనా అలజడి పెరగడంతో అదే కాన్సెప్ట్ తో మన దర్శకులు కొన్ని కథలు రాసుకున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కాన్సెప్ట్ తో రూపొందిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. కమెడియన్ సత్య నటించిన ‘వివాహ భోజనంబు’ సినిమా లాక్ డౌన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే ‘మంచి రోజులొచ్చాయి’, ‘WWW’ లాంటి సినిమాలు కూడా లాక్ డౌన్ కథలతో తెరకెక్కుతున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా లాక్ డౌన్ కథతో సినిమా చేస్తున్నాడు. విద్యాసాగర్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. ఇది లాక్ డౌన్ కథ అని తెలుస్తోంది. ఓ అమ్మాయిని పెళ్లిచూపులు చూడడానికి వెళ్తుంది అబ్బాయి ఫ్యామిలీ. అదే రోజున సడెన్ గా లాక్ డౌన్ అనౌన్స్ చేస్తారు. దీంతో అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఇంట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కథ ప్రకారం సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతుందట. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ ను కూడా నిర్మించారు. షూటింగ్ మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నా.. ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. ఇప్పటివరకు మాస్, యూత్ ఆడియన్స్ ను అలరించే సినిమాలు తీసిన విశ్వక్ సేన్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడు. మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడా చూడాలి!

This post was last modified on August 27, 2021 10:44 pm

Share
Show comments
Published by
suman
Tags: Vishwak Sen

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

1 hour ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

3 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

3 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

4 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

12 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

13 hours ago