దేశంలో కరోనా అలజడి పెరగడంతో అదే కాన్సెప్ట్ తో మన దర్శకులు కొన్ని కథలు రాసుకున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కాన్సెప్ట్ తో రూపొందిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. కమెడియన్ సత్య నటించిన ‘వివాహ భోజనంబు’ సినిమా లాక్ డౌన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే ‘మంచి రోజులొచ్చాయి’, ‘WWW’ లాంటి సినిమాలు కూడా లాక్ డౌన్ కథలతో తెరకెక్కుతున్నాయి.
ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా లాక్ డౌన్ కథతో సినిమా చేస్తున్నాడు. విద్యాసాగర్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. ఇది లాక్ డౌన్ కథ అని తెలుస్తోంది. ఓ అమ్మాయిని పెళ్లిచూపులు చూడడానికి వెళ్తుంది అబ్బాయి ఫ్యామిలీ. అదే రోజున సడెన్ గా లాక్ డౌన్ అనౌన్స్ చేస్తారు. దీంతో అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఇంట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
కథ ప్రకారం సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతుందట. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ ను కూడా నిర్మించారు. షూటింగ్ మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నా.. ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. ఇప్పటివరకు మాస్, యూత్ ఆడియన్స్ ను అలరించే సినిమాలు తీసిన విశ్వక్ సేన్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడు. మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడా చూడాలి!
This post was last modified on August 27, 2021 10:44 pm
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…