‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 రిలీజైన దగ్గర నుంచి సమంత చుట్టూ చాలా గాసిప్స్ తిరుగుతున్నాయి. ప్రభాస్-నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’లో సమంతను తీసుకోవాలనుకున్నారని.. కానీ నాగశ్విన్ ఆమెని పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. అలానే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది. వీటన్నింటిపై తాజాగా అక్కినేని కోడలు స్పందించింది.
ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తుందని అనుకున్నట్లు.. నాగశ్విన్ తనకే ఛాన్స్ ఇస్తాడని అనుకున్నానని.. కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చింది. అలానే ప్రభాస్ సినిమా నుండి సమంతను తీసేశారని.. నాగశ్విన్ సమంతకు ఛాన్స్ ఇవ్వలేదంటూ ఇంటర్నెట్ లో వార్తలు కనిపిస్తున్నాయని.. దీని గురించి నాగశ్విన్ ను గట్టిగా అడగాలనుకుంటున్నా అంటూ నవ్వుతూ రియాక్ట్ అయింది సమంత. ప్రస్తుతం తనకు కొత్త సినిమాలు చేసే మూడ్ లేదని.. కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది.
‘శాకుంతలం’ షూటింగ్ పూర్తయిందని.. కొంతకాలం పాటు కొత్త కథలు కూడా విననని స్పష్టం చేసింది. గ్యాప్ తీసుకొని కథలు వినడం మొదలుపెడతానని చెప్పింది. ఇప్పటివరకు అయితే కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదని.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో కూడా తను లేనట్లు క్లారిటీ ఇచ్చింది సమంత. భవిష్యత్తులో మహిళలు ప్రభావితం చేసే పాత్రల్లో నటించాలనుందంటూ చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…