అక్కినేని అఖిల్కు అర్జెంటుగా ఒక హిట్టు కావాలి. భారీ అంచనాల మధ్య వచ్చి అతడి తొలి చిత్రం అఖిల్ పెద్ద డిజాస్టర్ కాగా.. ఆశలు రేకెత్తించిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలకు కూడా చేదు అనుభవాలే మిగిలాయి. ఆ తర్వాత అఖిల్ గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశాడు. అది పోయినేడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా తప్పలేదు.
సినిమా పూర్తయిపోయినా సరే.. ఇప్పుడిప్పుడే థియేటర్లలో వచ్చేలా కనిపించడం లేదు. మధ్యలో ఓటీటీ రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది కానీ.. అలా చేస్తే అఖిల్ కెరీర్కు మంచిది కాదన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దసరా రేసులో నిలపబోతున్నట్లు తెలుస్తోంది. యూనిట్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
ఐతే దసరా సీజన్లో పోటీ కాస్త గట్టిగానే ఉండేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యతో పాటు నందమూరి బాలకృష్ణ మూవీ అఖండ దసరాకే వస్తాయని అంటున్నారు. నిజానికి దసరా కానుకగా అక్టోబరు 13న ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బ పడటంతో ఆ సమయానికి సినిమాను సిద్ధం చేయలేమని వాయిదా వేసేశారు. దీంతో ఆ ఖాళీని ఆచార్య, అఖండ సినిమాలు భర్తీ చేస్తాయిని అంటున్నారు.
ఐతే చిరు, బాలయ్యల తాకిడిని తట్టుకుని అఖిల్ తన ఉనికిని చాటగలడా అన్నది ప్రశ్న. చిరు కుటుంబంతో అఖిల్కు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. చరణ్ను అన్నయ్యలా చూస్తాడతను. మరి చిరు సినిమా బరిలో ఉండగా.. అఖిల్ ఆయనతో పోటీకి దిగుతాడా అన్నది ప్రశ్న. బహుశా దసరా సెలవుల్లోనే కొన్ని రోజుల గ్యాప్లో ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేయాలని అనుకుంటున్నారేమో మేకర్స్.
This post was last modified on August 25, 2021 12:10 am
ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కడ బ్రేక్ ఎలా రాసి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఒక బ్లాక్ బస్టర్ జాతకాలనే మార్చేస్తుంది. ఖాళీగా…
పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…