అక్కినేని అఖిల్కు అర్జెంటుగా ఒక హిట్టు కావాలి. భారీ అంచనాల మధ్య వచ్చి అతడి తొలి చిత్రం అఖిల్ పెద్ద డిజాస్టర్ కాగా.. ఆశలు రేకెత్తించిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలకు కూడా చేదు అనుభవాలే మిగిలాయి. ఆ తర్వాత అఖిల్ గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశాడు. అది పోయినేడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా తప్పలేదు.
సినిమా పూర్తయిపోయినా సరే.. ఇప్పుడిప్పుడే థియేటర్లలో వచ్చేలా కనిపించడం లేదు. మధ్యలో ఓటీటీ రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది కానీ.. అలా చేస్తే అఖిల్ కెరీర్కు మంచిది కాదన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దసరా రేసులో నిలపబోతున్నట్లు తెలుస్తోంది. యూనిట్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
ఐతే దసరా సీజన్లో పోటీ కాస్త గట్టిగానే ఉండేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యతో పాటు నందమూరి బాలకృష్ణ మూవీ అఖండ దసరాకే వస్తాయని అంటున్నారు. నిజానికి దసరా కానుకగా అక్టోబరు 13న ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బ పడటంతో ఆ సమయానికి సినిమాను సిద్ధం చేయలేమని వాయిదా వేసేశారు. దీంతో ఆ ఖాళీని ఆచార్య, అఖండ సినిమాలు భర్తీ చేస్తాయిని అంటున్నారు.
ఐతే చిరు, బాలయ్యల తాకిడిని తట్టుకుని అఖిల్ తన ఉనికిని చాటగలడా అన్నది ప్రశ్న. చిరు కుటుంబంతో అఖిల్కు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. చరణ్ను అన్నయ్యలా చూస్తాడతను. మరి చిరు సినిమా బరిలో ఉండగా.. అఖిల్ ఆయనతో పోటీకి దిగుతాడా అన్నది ప్రశ్న. బహుశా దసరా సెలవుల్లోనే కొన్ని రోజుల గ్యాప్లో ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేయాలని అనుకుంటున్నారేమో మేకర్స్.
This post was last modified on August 25, 2021 12:10 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…