అక్కినేని అఖిల్కు అర్జెంటుగా ఒక హిట్టు కావాలి. భారీ అంచనాల మధ్య వచ్చి అతడి తొలి చిత్రం అఖిల్ పెద్ద డిజాస్టర్ కాగా.. ఆశలు రేకెత్తించిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలకు కూడా చేదు అనుభవాలే మిగిలాయి. ఆ తర్వాత అఖిల్ గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశాడు. అది పోయినేడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా తప్పలేదు.
సినిమా పూర్తయిపోయినా సరే.. ఇప్పుడిప్పుడే థియేటర్లలో వచ్చేలా కనిపించడం లేదు. మధ్యలో ఓటీటీ రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది కానీ.. అలా చేస్తే అఖిల్ కెరీర్కు మంచిది కాదన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దసరా రేసులో నిలపబోతున్నట్లు తెలుస్తోంది. యూనిట్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
ఐతే దసరా సీజన్లో పోటీ కాస్త గట్టిగానే ఉండేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యతో పాటు నందమూరి బాలకృష్ణ మూవీ అఖండ దసరాకే వస్తాయని అంటున్నారు. నిజానికి దసరా కానుకగా అక్టోబరు 13న ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బ పడటంతో ఆ సమయానికి సినిమాను సిద్ధం చేయలేమని వాయిదా వేసేశారు. దీంతో ఆ ఖాళీని ఆచార్య, అఖండ సినిమాలు భర్తీ చేస్తాయిని అంటున్నారు.
ఐతే చిరు, బాలయ్యల తాకిడిని తట్టుకుని అఖిల్ తన ఉనికిని చాటగలడా అన్నది ప్రశ్న. చిరు కుటుంబంతో అఖిల్కు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. చరణ్ను అన్నయ్యలా చూస్తాడతను. మరి చిరు సినిమా బరిలో ఉండగా.. అఖిల్ ఆయనతో పోటీకి దిగుతాడా అన్నది ప్రశ్న. బహుశా దసరా సెలవుల్లోనే కొన్ని రోజుల గ్యాప్లో ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేయాలని అనుకుంటున్నారేమో మేకర్స్.
This post was last modified on August 25, 2021 12:10 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…