సరైన హిట్టు కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. నిను వీడని నీడను నేనే, ఎ1 ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలో ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. చాలా ఏళ్ల నుంచి నిఖార్సయిన విజయం మాత్రం దక్కట్లేదు. ఆ లోటును గల్లీ రౌడీ భర్తీ చేస్తుందన్న ఆశతో ఉన్నాడు సందీప్. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా పూర్తయినా.. థియేటర్లు మూత పడటంతో రిలీజ్ ఆలస్యమైంది. ఈ మధ్యే థియేటర్లు తెరుచుకుని వసూళ్లు కూడా పుంజుకుంటున్న నేపథ్యంలో సెప్టెంబరు 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించింది చిత్ర బృందం.
అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించి, పోస్టర్లు కూడా వదిలారు. ప్రమోషన్లు కూడా గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. ఐతే వారి ఉత్సాహం మీద గోపీచంద్ మూవీ సీటీమార్ టీం నీళ్లు చల్లింది. మంచి అంచనాలున్న ఆ మాస్ సినిమాను సెప్టెంబరు 3నే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఆల్రెడీ అవసరాల శ్రీనివాస్ సినిమా నూటొక్క జిల్లాల అందగాడు కూడా సెప్టెంబరు 3కే ఫిక్స్ అయింది. అదే రోజు హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9 కూడా ఇండియాలో పెద్ద ఎత్తున రిలీజవుతోంది. ఇంత పోటీ మధ్య తమ సినిమా దెబ్బ తింటుందని అనుకున్నారో ఏమో… ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
దీని సమర్పకుడు కోన వెంకట్ ఒకింత అసహనంతోనే ట్వీట్ కూడా పెట్టారు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని తమ చిత్రాన్ని సెప్టెంబరు 3న రిలీజ్ చేయాలని ప్రకటించామని, కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నామని.. ఐతే సెప్టెంబర్లోనే తమ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన ప్రకటించారు. ఆ ట్వీట్ చూస్తే.. ఉన్నట్లుండి సీటీమార్ చిత్రాన్ని సెప్టెంబరు 3కు ఫిక్స్ చేయడం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on August 25, 2021 12:01 am
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…