Movie News

తలైవి వచ్చేస్తోంది

ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయాక కరోనా దెబ్బకు రిలీజ్ ఆగిపోయిన ప్రముఖ చిత్రాల్లో ‘తలైవి’ ఒకటి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎ.ఎల్.విజయ్ రూపొందించిన ఈ భారీ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరగడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు.

మళ్లీ దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుని పూర్తి స్థాయిలో నడిచే రోజుల కోసం ఎదురు చూస్తున్న చిత్ర బృందం.. ఎట్టకేలకు కాస్త పరిస్థితులు మెరుగుపడటంతో తమ సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించేసింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ‘తలైవి’ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగు వాడైన విష్ణు ఇందూరి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడు కావడం విశేషం.

ఉత్తరాదిన ఇప్పటికీ థియేటర్లు పూర్తి స్థాయిలో నడవట్లేదు. కాకపోతే గతంతో పోలిస్తే కాస్త మెరుగు. ఇటీవలే అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ను ధైర్యం చేసి రిలీజ్ చేసేయడం తెలిసిన సంగతే. కానీ ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం వచ్చింది. కాకపోతే ‘తలైవి’ సినిమాను ఇంకెంతో కాలం ఆపి ఉంచే పరిస్థితి లేదు. తమిళనాట తాజాగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసేశారు. జయలలిత మీద తీసిని సినమా కాబట్టి ‘తలైవి’కి దక్షిణాదిన మంచి వసూళ్లు వస్తాయన్న ఆశ ఉంది. అందుకే ఇక్కడి మార్కెట్ ఆశాజనకంగా ఉండటంతో రిలీజ్ డేట్ ఇచ్చేశారు.

ఈ చిత్రంలో జయలలిత పాత్రను పోషించడం కోసం కంగనా చాలానే కష్టపడింది. బాగా లావై తన అవతారాన్ని మార్చుకుంది. మేకప్ కూడా తోడవడంతో జయలలితగా కంగనా అవతారం ఆకర్షణీయంగానే మారింది. ఇక ఆమె ఎంత మంచి పెర్ఫామరో తెలిసిందే కాబట్టి ‘తలైవి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 10న తెలుగులో ‘లవ్ స్టోరి’ లాంటి క్రేజీ మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on August 23, 2021 5:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

6 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

29 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

49 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago