సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అలాగే అలాంటి ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోయిన్లతో సినిమా అన్నా కూడా కొంచెం కష్టమైన విషయమే. ఇద్దరి ఇమేజ్లను బ్యాలెన్స్ చేస్తూ పాత్రలు ఉండేలా చూసుకోవాలి. ఇద్దరి మధ్య ఎలాంటి ఇగో క్లాషెస్ రాకుండా చూసుకోవడమూ కీలకమే. ఐతే తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇప్పు ఈ సాహసమే చేస్తున్నాడు.
సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లయిన నయనతార, సమంతలతో అతను ఒక సినిమా తీస్తున్నాడు. ఇందులో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ ముగ్గురి కలయికే సినిమా మీద ప్రత్యేక ఆసక్తికి కారణమవుతోంది. నయన్, సామ్ కలిసి ఇప్పటిదాకా ఏ చిత్రంలోనూ నటించలేదు. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు.
అలాంటిది ఇప్పుడు హీరోయిన్ ప్రాధాన్యమున్న థ్రిల్లర్ మూవీలో కలిసి నటించబోతున్నారు. సినిమా తీస్తున్నది తన ప్రియుడే కావడంతో సామ్తో కలిసి నటించడానికి నయన్కు పెద్దగా అభ్యంతరం లేకపోయి ఉండి ఉండొచ్చు. ఐతే సమంత ఈ సినిమాలో నటించడానికి ఇబ్బంది పడకుండా ఆమె సెట్లోకి అడుగు పెట్టగానే ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నయన్. ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో అద్భుత నటనకు గాను సమంతకు ఓ అంతర్జాతీయ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆమెను అభినందిస్తూ తమ సినిమా సెట్స్లోకి అడుగు పెట్టిన సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పింది నయన్ అండ్ టీం. సమంతకు శుభాకాంక్షలు చెబుతూ కేక్ తయారు చేయించి ఆమెతో దాన్ని కట్ చేయించారు. చిన్న పార్టీ కూడా ఇచ్చారు.
ఈ సర్ప్ర్రైజ్ సమంతను ఎంతో ఆనందింపజేసినట్లే ఉంది ఫొటోలు చూస్తుంటే. సమంత, నయన్ కలిసి చాలా సదరాగా పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరు సూపర్ స్టార్ హీరోయిన్లు ఇలా సరదాగా కనిపిస్తున్న ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
This post was last modified on August 23, 2021 3:21 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…