మెగాస్టార్ చిరంజీవితో మెహర్ రమేష్.. ఏడాది కిందట మొదటగా ఈ సమాచారం బయటికి వచ్చినపుడు మెగా అభిమానులు బెంబేలెత్తిపోయారు. శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసి ఏడెనిమిదేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇవ్వడమేంటనే ప్రశ్న వారి మెదళ్లను తొలిచేసింది.
మెహర్తో సినిమా వద్దే వద్దు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా నెగెటివ్గానే స్పందించారు. ఈ చిత్రంపై ఏమాత్రం ఆసక్తి లేనట్లే వ్యవహరించారు. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వార్తలొచ్చినా వారిలో ఎగ్జైట్మెంట్ కనిపించలేదు.
చివరికి శనివారం సాయంత్రం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. భోళా శంకర్ అనే క్యాచీ టైటిల్తో వచ్చాడు మెహర్ రమేష్. ఆ టైటిల్తో పాటు లోగో, పోస్టర్ డిజైన్ ఆకర్షణీయంగానే కనిపించాయి. ఇక ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా చిరు-కీర్తిలపై చిన్న వీడియో గ్లింపక్స్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా ఓకే అనిపించింది. మొత్తానికి సినిమాకు సంబంధించి తాజాగా వెల్లడించిన విశేషాలు వావ్ అనిపించేలా లేకపోయినా.. వీటికి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అయితే లేదు. రెస్పాన్స్ పాజిటివ్గానే ఉంది.
ఇప్పటి వరకు అయితే మెహర్ రమేష్కు పాస్ మార్కులే పడతాయి. మునుపటితో పోలిస్తే ఇప్పుడు అతడి పట్ల మెగా అభిమానుల్లో నెగెటివిటీ తగ్గినట్లే ఉంది. సినిమా అయితే అనౌన్స్ అయిపోయింది, త్వరలో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు కాబట్టి వాస్తవాన్ని అంగీకరిస్తున్నట్లే ఉన్నారు ఫ్యాన్స్. ఎలాగూ ఇది రీమేక్ మూవీనే కాబట్టి ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్న కంగారు కూడా అక్కర్లేదు. ఒక సగటు మాస్ మసాలా సినిమాతో చిరు-మెహర్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాబట్టి ఇక మెహర్ గురించి వాళ్లకు ఎక్కువ ఆందోళన అవసరం లేదేమో.
This post was last modified on August 22, 2021 10:03 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…