మెగాస్టార్ చిరంజీవితో మెహర్ రమేష్.. ఏడాది కిందట మొదటగా ఈ సమాచారం బయటికి వచ్చినపుడు మెగా అభిమానులు బెంబేలెత్తిపోయారు. శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసి ఏడెనిమిదేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇవ్వడమేంటనే ప్రశ్న వారి మెదళ్లను తొలిచేసింది.
మెహర్తో సినిమా వద్దే వద్దు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా నెగెటివ్గానే స్పందించారు. ఈ చిత్రంపై ఏమాత్రం ఆసక్తి లేనట్లే వ్యవహరించారు. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వార్తలొచ్చినా వారిలో ఎగ్జైట్మెంట్ కనిపించలేదు.
చివరికి శనివారం సాయంత్రం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. భోళా శంకర్ అనే క్యాచీ టైటిల్తో వచ్చాడు మెహర్ రమేష్. ఆ టైటిల్తో పాటు లోగో, పోస్టర్ డిజైన్ ఆకర్షణీయంగానే కనిపించాయి. ఇక ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా చిరు-కీర్తిలపై చిన్న వీడియో గ్లింపక్స్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా ఓకే అనిపించింది. మొత్తానికి సినిమాకు సంబంధించి తాజాగా వెల్లడించిన విశేషాలు వావ్ అనిపించేలా లేకపోయినా.. వీటికి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అయితే లేదు. రెస్పాన్స్ పాజిటివ్గానే ఉంది.
ఇప్పటి వరకు అయితే మెహర్ రమేష్కు పాస్ మార్కులే పడతాయి. మునుపటితో పోలిస్తే ఇప్పుడు అతడి పట్ల మెగా అభిమానుల్లో నెగెటివిటీ తగ్గినట్లే ఉంది. సినిమా అయితే అనౌన్స్ అయిపోయింది, త్వరలో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు కాబట్టి వాస్తవాన్ని అంగీకరిస్తున్నట్లే ఉన్నారు ఫ్యాన్స్. ఎలాగూ ఇది రీమేక్ మూవీనే కాబట్టి ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్న కంగారు కూడా అక్కర్లేదు. ఒక సగటు మాస్ మసాలా సినిమాతో చిరు-మెహర్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాబట్టి ఇక మెహర్ గురించి వాళ్లకు ఎక్కువ ఆందోళన అవసరం లేదేమో.
This post was last modified on August 22, 2021 10:03 pm
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి…