మెగాస్టార్ చిరంజీవితో మెహర్ రమేష్.. ఏడాది కిందట మొదటగా ఈ సమాచారం బయటికి వచ్చినపుడు మెగా అభిమానులు బెంబేలెత్తిపోయారు. శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసి ఏడెనిమిదేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇవ్వడమేంటనే ప్రశ్న వారి మెదళ్లను తొలిచేసింది.
మెహర్తో సినిమా వద్దే వద్దు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా నెగెటివ్గానే స్పందించారు. ఈ చిత్రంపై ఏమాత్రం ఆసక్తి లేనట్లే వ్యవహరించారు. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వార్తలొచ్చినా వారిలో ఎగ్జైట్మెంట్ కనిపించలేదు.
చివరికి శనివారం సాయంత్రం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. భోళా శంకర్ అనే క్యాచీ టైటిల్తో వచ్చాడు మెహర్ రమేష్. ఆ టైటిల్తో పాటు లోగో, పోస్టర్ డిజైన్ ఆకర్షణీయంగానే కనిపించాయి. ఇక ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా చిరు-కీర్తిలపై చిన్న వీడియో గ్లింపక్స్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా ఓకే అనిపించింది. మొత్తానికి సినిమాకు సంబంధించి తాజాగా వెల్లడించిన విశేషాలు వావ్ అనిపించేలా లేకపోయినా.. వీటికి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అయితే లేదు. రెస్పాన్స్ పాజిటివ్గానే ఉంది.
ఇప్పటి వరకు అయితే మెహర్ రమేష్కు పాస్ మార్కులే పడతాయి. మునుపటితో పోలిస్తే ఇప్పుడు అతడి పట్ల మెగా అభిమానుల్లో నెగెటివిటీ తగ్గినట్లే ఉంది. సినిమా అయితే అనౌన్స్ అయిపోయింది, త్వరలో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు కాబట్టి వాస్తవాన్ని అంగీకరిస్తున్నట్లే ఉన్నారు ఫ్యాన్స్. ఎలాగూ ఇది రీమేక్ మూవీనే కాబట్టి ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్న కంగారు కూడా అక్కర్లేదు. ఒక సగటు మాస్ మసాలా సినిమాతో చిరు-మెహర్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాబట్టి ఇక మెహర్ గురించి వాళ్లకు ఎక్కువ ఆందోళన అవసరం లేదేమో.
This post was last modified on August 22, 2021 10:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…