మెగాస్టార్ చిరంజీవితో నయనతార మరోసారి స్క్రీన్ పంచుకోబోతుండటం ఖాయమైనట్లే కనిపిస్తోంది. చిరు ఇటీవలే మొదలుపెట్టిన ‘లూసిఫర్’ రీమేక్లో కీలక పాత్రకు నయన్ ఎంపికైనట్లుగా తమిళ పీఆర్వోలు పోస్టులు పెట్టారు. ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ల నుంచే ఈ పోస్టులు రావడంతో నయన్ ఈ చిత్రంలో నటించబోతుండటం పక్కా అనుకోవచ్చు. నయన్ ఇంతకుముందే ‘సైరా నరసింహారెడ్డిలో చిరుకు జోడీగా కనిపించింది. ఐతే ఆమె పాత్రకు స్క్రీన్ టైం తక్కువ. నయన్ను మించి తమన్నా హైలైట్ అయింది అందులో.
ఐతే ‘లూసిఫర్’ రీమేక్లో మాత్రం నయన్ది సినిమా అంతటా కనిపించే కీలకమైన పాత్రే. ‘లూసిఫర్’లో ఈ పాత్రను మంజు వారియర్ చేసింది. అందులో హీరోకు ఆమె వరుసకైతే చెల్లెలు అవుతుంది. హీరోను దత్త పుత్రుడిగా భావించే పెద్ద మనిషికి ఆమె కూతురు అవుతుంది. రక్త సంబంధం లేకున్నప్పటికీ అందులో హీరో, ఆ పాత్రధారి అన్నా చెల్లెళ్లనే ఫీలింగే కలుగుతుంది. ఐతే ‘సైరా’లో భార్యాభర్తలుగా కనిపించిన చిరు-నయన్లను ఇప్పుడు అన్నా చెల్లెళ్ల తరహా పాత్రల్లో చూసి ప్రేక్షకులు జీర్ణించుకోగలరా అన్నది సందేహం.
తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఈ పాత్రలో దర్శకుడు మోహన్ రాజా ఏమైనా మార్పులు చేసి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరుకు నయన్ జోడీగా కనిపించకపోయినా.. చెల్లెలిగా మాత్రం వద్దని మెజారిటీ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటారనడంలో సందేహం లేదు. మరి మోహన్ రాజా నయన్ పాత్రను ఎలా డిజైన్ చేశాడో చూడాలి. రీమేక్లు తీయడంలో మోహన్ రాజా ప్రత్యేకతే వేరు. తెలుగులో చేసిన ‘హనుమాన్ జంక్షన్’ మాత్రమే కాక.. తమిళంలో జయం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, బొమ్మరిల్లు లాంటి రీమేక్లతో అతను భారీ విజయాలందుకున్నాడు. మరి ‘లూసిఫర్’ను తెలుగులో అతనెలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on August 16, 2021 2:34 pm
ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ దాదాపుగా ఏడాదికి పైగానే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నారు. దువ్వాడకు సంబంధించి…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణానికి సంబంధించిన గుట్టు దాదాపుగా వీడిపోయినట్టేనని చెప్పాలి. ఈ వ్యవహారంలో కీలక భూమిక…
మే 1 విడుదలవుతున్న రెండు సినిమాలు హిట్ 3 ది థర్డ్ కేస్, రెట్రో దేనికవే ప్రత్యేక అంచనాలతో ప్రేక్షకుల…
ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో అరెస్టైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి.సీతారామాంజనేయులు…
విశ్వంభర సంగతేమో కానీ చిరంజీవి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎగ్జైటింగ్ ప్రాజెక్టుల్లో ముందు వరసలో ఉన్న సినిమా దర్శకుడు శ్రీకాంత్…
పీక్ సమ్మర్లో థియేటర్లు జనాల్లేక వెలవెలబోతుండడం పట్ల టాలీవుడ్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. వేరే ఇండస్ట్రీల పరిస్థితి కూడా ఏమంత…