ఈ మధ్య తమిళ హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్.. వంశీ పైడిపల్లితో ఓ బహు భాషా సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. అలాగే ధనుష్.. శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా రాబోతోంది. దీని గురించి ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. దీని తర్వాత మరో తెలుగు దర్శకుడితో ధనుష్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ డైరెక్టరే వెంకీ అట్లూరి.
తొలిప్రేమతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్దె చిత్రాలతో అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ అతను చెప్పిన ఓ కథ నచ్చి ధనుష్ సినిమా చేయడానికి ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కనుందట.
వెంకీతో రంగ్దె సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రానికి కథానాయిక కూడా ఖరారైనట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఈ చిత్రానికి కథానాయికగా ఓకే చేశారట. ధనుష్తో పూజా చేయనున్న తొలి చిత్రమిదే. ఈ చిత్రం విద్యా వ్యవస్థను బాగు చేయడానికి తపించే ఓ కుర్రాడి కథతో తెరకెక్కనున్నట్లుగా చెబుతున్నారు. కాన్సెప్ట్ ఇండియాలో అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుందని.. అందుకే ధనుష్ ఈ చిత్రం చేయడానికి ముందుకొచ్చాడని సమాచారం.
ఐతే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టొచ్చు. ధనుష్ తమిళంలో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి చేసి శేఖర్ కమ్ముల సినిమా కూడా చేశాక ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశముంది.
This post was last modified on August 16, 2021 10:59 am
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…