ఈ మధ్య తమిళ హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్.. వంశీ పైడిపల్లితో ఓ బహు భాషా సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. అలాగే ధనుష్.. శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా రాబోతోంది. దీని గురించి ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. దీని తర్వాత మరో తెలుగు దర్శకుడితో ధనుష్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ డైరెక్టరే వెంకీ అట్లూరి.
తొలిప్రేమతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్దె చిత్రాలతో అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ అతను చెప్పిన ఓ కథ నచ్చి ధనుష్ సినిమా చేయడానికి ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కనుందట.
వెంకీతో రంగ్దె సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రానికి కథానాయిక కూడా ఖరారైనట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఈ చిత్రానికి కథానాయికగా ఓకే చేశారట. ధనుష్తో పూజా చేయనున్న తొలి చిత్రమిదే. ఈ చిత్రం విద్యా వ్యవస్థను బాగు చేయడానికి తపించే ఓ కుర్రాడి కథతో తెరకెక్కనున్నట్లుగా చెబుతున్నారు. కాన్సెప్ట్ ఇండియాలో అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుందని.. అందుకే ధనుష్ ఈ చిత్రం చేయడానికి ముందుకొచ్చాడని సమాచారం.
ఐతే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టొచ్చు. ధనుష్ తమిళంలో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి చేసి శేఖర్ కమ్ముల సినిమా కూడా చేశాక ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశముంది.
This post was last modified on August 16, 2021 10:59 am
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…