ఈ మధ్య తమిళ హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్.. వంశీ పైడిపల్లితో ఓ బహు భాషా సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. అలాగే ధనుష్.. శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా రాబోతోంది. దీని గురించి ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. దీని తర్వాత మరో తెలుగు దర్శకుడితో ధనుష్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ డైరెక్టరే వెంకీ అట్లూరి.
తొలిప్రేమతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్దె చిత్రాలతో అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ అతను చెప్పిన ఓ కథ నచ్చి ధనుష్ సినిమా చేయడానికి ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కనుందట.
వెంకీతో రంగ్దె సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రానికి కథానాయిక కూడా ఖరారైనట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఈ చిత్రానికి కథానాయికగా ఓకే చేశారట. ధనుష్తో పూజా చేయనున్న తొలి చిత్రమిదే. ఈ చిత్రం విద్యా వ్యవస్థను బాగు చేయడానికి తపించే ఓ కుర్రాడి కథతో తెరకెక్కనున్నట్లుగా చెబుతున్నారు. కాన్సెప్ట్ ఇండియాలో అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుందని.. అందుకే ధనుష్ ఈ చిత్రం చేయడానికి ముందుకొచ్చాడని సమాచారం.
ఐతే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టొచ్చు. ధనుష్ తమిళంలో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి చేసి శేఖర్ కమ్ముల సినిమా కూడా చేశాక ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశముంది.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…