ఈ మధ్య తమిళ హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్.. వంశీ పైడిపల్లితో ఓ బహు భాషా సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. అలాగే ధనుష్.. శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా రాబోతోంది. దీని గురించి ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. దీని తర్వాత మరో తెలుగు దర్శకుడితో ధనుష్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ డైరెక్టరే వెంకీ అట్లూరి.
తొలిప్రేమతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్దె చిత్రాలతో అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ అతను చెప్పిన ఓ కథ నచ్చి ధనుష్ సినిమా చేయడానికి ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కనుందట.
వెంకీతో రంగ్దె సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రానికి కథానాయిక కూడా ఖరారైనట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఈ చిత్రానికి కథానాయికగా ఓకే చేశారట. ధనుష్తో పూజా చేయనున్న తొలి చిత్రమిదే. ఈ చిత్రం విద్యా వ్యవస్థను బాగు చేయడానికి తపించే ఓ కుర్రాడి కథతో తెరకెక్కనున్నట్లుగా చెబుతున్నారు. కాన్సెప్ట్ ఇండియాలో అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుందని.. అందుకే ధనుష్ ఈ చిత్రం చేయడానికి ముందుకొచ్చాడని సమాచారం.
ఐతే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టొచ్చు. ధనుష్ తమిళంలో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి చేసి శేఖర్ కమ్ముల సినిమా కూడా చేశాక ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశముంది.
This post was last modified on August 16, 2021 10:59 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…