సినీ రంగంలో దేన్నయినా టేకిట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటే ఏమవుతుందో షారుఖ్ ఖాన్ విషయంలో అందరూ చూశారు. తాను ఏ సినిమా తీసినా బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ వచ్చేస్తున్నాయని.. సినిమాలో తానుంటే చాలని, కథ గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనే ఫీలింగ్తో కొన్నేళ్ల పాటు వరుసగా సాధారణమైన సినిమాలు చేశాడు షారుఖ్.
ఈ క్రమంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ లాంటి చెత్త సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఇలా వరుసబెట్టి మామూలు సినిమాలు తీస్తుంటే ఒక దశ దాటాక ప్రేక్షకులకు మొహం మొత్తేస్తుంది. ఆ హీరో మీద నమ్మకం కోల్పోతారు. వరుసగా సినిమాలను తిరస్కరించడం మొదలుపెడతారు. షారుఖ్ విషయంలోనూ అదే జరిగింది.
అంత పెద్ద స్టార్ సినిమాలకు రూ.50 కోట్ల ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి తలెత్తింది. చివరగా షారుఖ్ నుంచి వచ్చిన ‘జీరో’తో అతను దాదాపు జీరో అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండేళ్లకు పైగా విరామం తీసుకుని జాగ్రత్తగా సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు.
షారుఖ్ తర్వాత సల్మాన్ సైతం పనికి రాని సినిమాలతో ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతున్నాడు. ఈ మధ్యే వచ్చిన అతడి చిత్రం ‘రాధె’ చూసి అభిమానులు కూడా ఛీకొట్టారు. మరీ ఇంత నాసిరకం సినిమాలు తీస్తావా అంటూ సోషల్ మీడియా వేదికగా సల్మాన్పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అతను ‘అంతిమ్’, ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘మాస్టర్’ రీమేక్లో నటిస్తాడని ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు సల్మాన్ ఆలోచన మారినట్లు సమాచారం. వరుసగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో పలుచన అయిపోతానని భావించి.. ఇప్పుడో ప్రయోగాత్మక భారీ చిత్రం చేయడానికి అతను రెడీ అయ్యాడట. మ్యాన్ వెర్సస్ నేచర్ కాన్సెప్ట్గా పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే ఒక భారీ సినిమాకు సల్మాన్ సన్నాహాలు చేసుకుంటున్నాడట.
ఈ చిత్ర బడ్జెట్ రూ.300 కోట్లని.. సల్మాన్ కెరీర్లోనే అత్యధిక ఖర్చుతో తెరకెక్కనున్న చిత్రమిదని.. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా చేయడానికి తన టీంతో కలిసి సల్మాన్ పని చేస్తున్నాడని.. త్వరలోనే దీని గురించి అనౌన్స్మెంట్ రానుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
This post was last modified on August 16, 2021 6:48 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…