ఈ తరం యువ కథానాయకులు స్టేజ్ల మీద మాట్లాడేటపుడు ఎంత దూకుడుగా కనిపిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పటి యూత్ను ఆకట్టుకోవడానికి ఏదో ఒకటి కొత్తగా చేయాలి. భిన్నంగా మాట్లాడాలి. దూకుడుగా వ్యవహరించాలి. విజయ్ దేవరకొండ ఈ విషయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. మరో యంగ్ హీరో విశ్వక్సేన్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివేశాడు. విజయ్ని మించి దూకుడుగా, సెన్సేషనల్గా మాట్లాడ్డానికి ట్రై చేస్తుంటాడతను. కొన్నిసార్లు అతను ఎక్స్ట్రీమ్ లెవెల్కు కూడా వెళ్లిపోతుంటాడు.
తాజాగా తన కొత్త చిత్రం ‘పాగల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ స్పీచ్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్గా మారింది. సినిమా మీద అతడికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ.. అతను ‘పాగల్’ గురించి ఇచ్చిన స్టేట్మెంట్లు మామూలుగా లేవు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వల్ల మూత పడిపోయిన థియేటర్లను కూడా ‘పాగల్’ సినిమాతో తెరిపించేస్తానని విశ్వక్ స్టేట్మెంట్లు ఇవ్వడం విశేషం.
ఈ పరిస్థితుల్లో ‘పాగల్’ను రిలీజ్ చేస్తున్నావేంటి, కరెక్టేనా అని కొంతమంది సందేహించారని.. ఐతే సర్కస్లో ఉన్న సింహంతో ఎవ్వరైనా ఆడుకుంటారని, కానీ తాను అడివిలో సింహంతో ఆడుకునే టైపని.. అందుకే తన చిత్రాన్ని ఈ పరిస్థితుల్లో రిలీజ్ చేస్తున్నానని.. సినిమా మామూలుగా ఉండదని.. మూతపడిన థియేటర్లను సైతం తన సినిమాతో తెరిపిస్తానని.. తన పేరు విశ్వక్సేన్ అని.. అలా జరక్కపోతే పేరు మార్చుకుంటానని విశ్వక్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
మరోవైపు తన స్పీచ్ మొదలవుతున్నపుడే టైం లేటైందని.. బయట షాపులు మూసేస్తారని భయ్యాలు టెన్షన్ పడుతుండొచ్చని అనడం ద్వారా పరోక్షంగా వైన్ షాపుల ప్రస్తావన తెచ్చాడు విశ్వక్. అంతే కాక కింది నుంచి అభిమానులు మధ్య మధ్యలో అరుస్తుంటే.. ‘తాగుదాం.. మందు తాగుదాం’ అంటూ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలోని డైలాగ్ను గుర్తు తెచ్చాడు విశ్వక్. సినిమా హిట్టయ్యాక కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం.. మందు తాగుదాం అంటూ మరోసారి అతను నొక్కి వక్కాణించాడు.
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…