ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘నాయట్టు’ (తెలుగులో వేట అని అర్ధం) అనే సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కుంచకో బొబన్, జోజు జార్జ్, నిమిష సజయన్ లాంటి తారలు నటించారు. ఈ ముగ్గురు చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ ముగ్గురు పోలీస్ ఉద్యోగులు ఊహించని విధంగా ఓ యాక్సిడెంట్ లో ఇరుక్కుంటారు. చేయని నేరం నుండి బయటపడడానికి నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరకు ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.
ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కనడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ హక్కులను గీతాఆర్ట్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పుడు నటీనటులను ఎంపిక చేసే పనిలో పడింది. లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కోసం హీరోయిన్ అంజలిని ఎన్నుకున్నట్లు సమాచారం. అలానే జోజు జార్జ్ పాత్ర కోసం సీనియర్ నటుడు రావు రమేష్ ను అడుగుతున్నారట. మరో కీలకపాత్రలో సత్యదేవ్ లేదా శ్రీవిష్ణు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అలానే దర్శకుడిగా చాలా మంది పేర్లు అనుకుంటున్నారు. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేయనున్న గౌతమ్ మీనన్ ను తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని అడుగుదామనుకుంటున్నారు. మరోపక్క సుధీర్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on August 10, 2021 10:40 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…