ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘నాయట్టు’ (తెలుగులో వేట అని అర్ధం) అనే సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కుంచకో బొబన్, జోజు జార్జ్, నిమిష సజయన్ లాంటి తారలు నటించారు. ఈ ముగ్గురు చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ ముగ్గురు పోలీస్ ఉద్యోగులు ఊహించని విధంగా ఓ యాక్సిడెంట్ లో ఇరుక్కుంటారు. చేయని నేరం నుండి బయటపడడానికి నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరకు ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.
ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కనడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ హక్కులను గీతాఆర్ట్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పుడు నటీనటులను ఎంపిక చేసే పనిలో పడింది. లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కోసం హీరోయిన్ అంజలిని ఎన్నుకున్నట్లు సమాచారం. అలానే జోజు జార్జ్ పాత్ర కోసం సీనియర్ నటుడు రావు రమేష్ ను అడుగుతున్నారట. మరో కీలకపాత్రలో సత్యదేవ్ లేదా శ్రీవిష్ణు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అలానే దర్శకుడిగా చాలా మంది పేర్లు అనుకుంటున్నారు. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేయనున్న గౌతమ్ మీనన్ ను తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని అడుగుదామనుకుంటున్నారు. మరోపక్క సుధీర్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on August 10, 2021 10:40 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…