Movie News

‘నాయట్టు’ రీమేక్ కోసం టాలెంటెడ్ యాక్టర్స్!

ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘నాయట్టు’ (తెలుగులో వేట అని అర్ధం) అనే సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కుంచకో బొబన్, జోజు జార్జ్, నిమిష సజయన్ లాంటి తారలు నటించారు. ఈ ముగ్గురు చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ ముగ్గురు పోలీస్ ఉద్యోగులు ఊహించని విధంగా ఓ యాక్సిడెంట్ లో ఇరుక్కుంటారు. చేయని నేరం నుండి బయటపడడానికి నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరకు ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.

ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కనడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ హక్కులను గీతాఆర్ట్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పుడు నటీనటులను ఎంపిక చేసే పనిలో పడింది. లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కోసం హీరోయిన్ అంజలిని ఎన్నుకున్నట్లు సమాచారం. అలానే జోజు జార్జ్ పాత్ర కోసం సీనియర్ నటుడు రావు రమేష్ ను అడుగుతున్నారట. మరో కీలకపాత్రలో సత్యదేవ్ లేదా శ్రీవిష్ణు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అలానే దర్శకుడిగా చాలా మంది పేర్లు అనుకుంటున్నారు. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేయనున్న గౌతమ్ మీనన్ ను తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని అడుగుదామనుకుంటున్నారు. మరోపక్క సుధీర్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

This post was last modified on August 10, 2021 10:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

46 minutes ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

1 hour ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

6 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

8 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

11 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

12 hours ago