ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘నాయట్టు’ (తెలుగులో వేట అని అర్ధం) అనే సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కుంచకో బొబన్, జోజు జార్జ్, నిమిష సజయన్ లాంటి తారలు నటించారు. ఈ ముగ్గురు చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ ముగ్గురు పోలీస్ ఉద్యోగులు ఊహించని విధంగా ఓ యాక్సిడెంట్ లో ఇరుక్కుంటారు. చేయని నేరం నుండి బయటపడడానికి నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరకు ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.
ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కనడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ హక్కులను గీతాఆర్ట్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పుడు నటీనటులను ఎంపిక చేసే పనిలో పడింది. లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కోసం హీరోయిన్ అంజలిని ఎన్నుకున్నట్లు సమాచారం. అలానే జోజు జార్జ్ పాత్ర కోసం సీనియర్ నటుడు రావు రమేష్ ను అడుగుతున్నారట. మరో కీలకపాత్రలో సత్యదేవ్ లేదా శ్రీవిష్ణు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అలానే దర్శకుడిగా చాలా మంది పేర్లు అనుకుంటున్నారు. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేయనున్న గౌతమ్ మీనన్ ను తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని అడుగుదామనుకుంటున్నారు. మరోపక్క సుధీర్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on August 10, 2021 10:40 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…