ఈ వారం సడెన్గా రిలీజ్కు రెడీ అయిన సినిమా పాగల్. విశ్వక్సేన్ హీరోగా కొత్త దర్శకుడు నరేష్ కుప్పిలి రూపొందించిన చిత్రమిది. దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్ నిర్మించారు. శనివారం పాగల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ చిత్ర హీరోయిన్లలో ఒకరైన నివేథా పెతురాజ్ మీడియాతో మాట్లాడింది. పాగల్ కథ వింటున్నపుడు కొన్ని సన్నివేశాల్లో ఉద్వేగానికి గురై ఏడ్చేసినట్లు ఆమె వెల్లడించింది.
“ఈ కథ రెండేళ్ల ముందే నా దగ్గరికి వచ్చింది. డైరెక్టర్ నరేష్ కుప్పిలి చెన్నైకి వచ్చి నాకు కథ వినిపించాడు. వినగానే స్క్రిప్టుతో బాగా కనెక్ట్ అయిపోయాను. దిల్ రాజు గారికి కూడా కథ నచ్చి నాతో మాట్లాడారు. దీంతో ఈ స్క్రిప్టుపై మరింత నమ్మకం వచ్చింది. తొలిసారి కథ వినిపించాక.. ఆపై మరో నాలుగుసార్లు కథ విన్నాను. ప్రతిసారీ మొదటిసారిలాగే ఎమోషనల్ అయ్యాను. నరేష్ నాకు కథ చెప్పేటప్పుడు.. కొన్ని సన్నివేశాల్లో నాకు నిజంగానే ఏడుపొచ్చేసి కన్నీళ్లు పెట్టుకున్నా” అని నివేథా చెప్పింది.
పాగల్ సినిమాలో తన పాత్ర పేరు ముందు గీత అని పెట్టారని.. ఐతే అందులో ఫీల్ లేదని తర్వాత తీర అని పేరు మార్చారని నివేథా వెల్లడించింది. ‘సఖి’ సినిమాలోలో మాధవన్, షాలిని మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో.. పాగల్ మూవీలో అలాంటి ఎమోషన్స్ ఉంటాయని నివేథా అంది. ఇక తన వ్యక్తిగత విషయాల గురించి నివేథా మాట్లాడుతూ.. తాను చూడటానికి సీరియస్ అమ్మాయిలా కనపడతానని.. తనకు యాటీట్యూడ్ ఉందని చాలా మంది అనుకుంటారని.. అందుకు తన అప్పీయరెన్స్ కారణమై ఉండొచ్చని.. తనకు వచ్చే పాత్రలు కూడా అలాగే ఉంటున్నాయని ఆమె అంది.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…