‘ఐకాన్’ అనే సినిమా గురించి చర్చ ఇప్పటిది కాదు. మూడేళ్ల ముందే మొదలవుతుందనుకున్న సినిమా అది. అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఇది. అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య’ డిజాస్టర్ అయ్యాక అనౌన్స్ అయిన సినిమా ఇది. దీన్నే బన్నీ తర్వాతి సినిమాగా చేస్తాడని అనుకున్నారు. కానీ అనుకోకుండా ‘అల వైకుంఠపురములో’ వచ్చింది. ఆ తర్వాత అల్లు హీరో ‘పుష్ప’ చేస్తున్నాడు.
‘ఐకాన్’ సంగతి చాన్నాళ్ల పాటు ఎటూ తేల్చకుండా ఉండిపోయాడు. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందని.. వేరే హీరోతో చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ ప్రచారాలు నిజం కాదని తేలింది. బన్నీతోనే వేణు ఈ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ‘పుష్ప’ పార్ట్-1 పూర్తి కాగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టడానికి చూస్తున్నాడు బన్నీ. ఐతే కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి సమాచారం అయితే ఏదీ బయటికి రాలేదు.
ఐతే హడావుడి లేకుండా సైలెంటుగా ‘ఐకాన్’ ప్రి ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నట్లు తెలిసింది. ఇంకో రెండు నెలల్లో బన్నీ ఈ సినిమాకు అందుబాటులోకి వస్తాడట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులతో పాటు కాస్ట్ అండ్ క్రూ ఎంపిక పనిలో బిజీగా ఉన్నాడు వేణు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారని.. ఇద్దరి పాత్రలకూ మంచి ప్రాధాన్యం ఉంటుందని.. ఆ పాత్రల కోసం పూజా హెగ్డే, రష్మిక మందన్నా పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం.
పూజాతో ఇప్పటికే బన్నీ రెండు సినిమాలు చేశాడు. రష్మికతో ‘పుష్ప’లో కలిసి నటిస్తున్నాడు. ఇద్దరూ తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్లు. ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ప్రేక్షకులకు పండగే అనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి స్క్రిప్టు ఎప్పుడో పూర్తి కాగా.. దానికి మెరుగులు దిద్దే పని కూడా జరుగుతోంది. పక్కాగా షెడ్యూళ్లు వేసుకుని బన్నీ అందుబాటులోకి రాగానే నాలుగైదు నెలల్లో సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on August 9, 2021 6:27 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…