Movie News

వాళ్లు మెడల్స్ గెలిస్తే.. బాలీవుడ్‌పై కౌంటర్లు

మధ్యలో నిరాశకు గురి చేసినా.. చివరికొచ్చేసరికి టోక్యో ఒలింపిక్స్‌ను భారత బృందం సంతృప్తిగానే ముగిస్తోంది. ఇప్పటిదాకా భారత ఒలింపిక్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టోక్యోలో ఏడు పతకాలు దక్కాయి దేశానికి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన ఆరు పతకాలదే ఇప్పటిదాకా రికార్డు. గత పర్యాయం ఆ సంఖ్యను మించేస్తామని ఆశిస్తే కేవలం రెండు పతకాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి పతక పోటీల తొలి రోజే మీరాబాయి చాను రజతం గెలవడంతో మన బృందంపై అంచనాలు పెరిగిపోయాయి.

కానీ భారీ అంచనాలు పెట్టుకున్న షూటర్లు సహా తర్వాత ఐదారు రోజుల్లో భారత క్రీడాకారులు తీవ్రంగా నిరాశ పరిచారు. ఐతే తర్వాతి వారం రోజుల్లో ప్రదర్శన మెరుగైంది. అరడజను పతకాలు వచ్చాయి. చివరి రోజు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడంతో టోక్యోలో భారత్‌ ప్రయాణానికి అద్భుతమైన ముగింపు లభించింది.

ఐతే భారత క్రీడాకారులు అక్కడలా పతకాలు గెలుస్తుంటే.. సోషల్ మీడయిాలో బాలీవుడ్ వాళ్లపై కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే ఏ ఒక్కరినీ వీళ్లు విడిచిపెట్టరని.. వెంటనే వారి బయోపిక్స్ కోసం సన్నాహాలు మొదలుపెట్టేసి ఉంటారని.. ఉన్నవీ లేనివీ కల్పించి సినిమాలు తీసి ఆయా క్రీడాకారులపై ఉన్న ఇంప్రెషన్ కూడా పోగొట్టేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మిల్కాసింగ్, ధోని లాంటి వాళ్ల బయోపిక్స్ బాగా ఆడాయి కానీ.. మిగతా స్పోర్ట్స్ పర్సన్స్ జీవిత కథలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అప్పట్లో ‘మేరీకోమ్’ సినిమాకు ఆదరణే దక్కలేదు. ఈ మధ్య సైనా మీద సినిమా వస్తే అదీ తుస్సుమంది. ఇంకా సింధు, సానియా, గోపీచంద్ లాంటి వాళ్ల బయోపిక్స్ లైన్లో ఉన్నాయి. అవి ఎంతకూ తెగట్లేదు. ఇప్పుడేమో బాలీవుడ్ వాళ్లు ఒలింపిక్స్ మెడలిస్టులపై పడతారని.. నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, రవి దహియా లాంటి వాళ్లను వదిలే ప్రసక్తే ఉండదని.. ముఖ్యంగా కొన్ని రోజుల్లోనే నీరజ్ చోప్రా బయోపిక్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా నీరజ్ బయోపిక్ గురించి ఇంతకుముందే అతణ్ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తన పాత్రలో రణదీప్ హుడా లేదా అక్షయ్ కుమార్ నటిస్తే బాగుంటుందని పేర్కొనడం విశేషం.

Satya

Recent Posts

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

1 hour ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

5 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

5 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

7 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

7 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

8 hours ago