థియేటర్లలో సినిమాలను విడుదల చేయాలనుకుంటున్న దర్శకనిర్మాతలకు ప్రస్తుతం పరిస్థితులు సహకరించడం లేదు. కరోనా మొదలైనప్పటి నుండి సినీ నిర్మాతలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. థియేటర్లు క్లోజ్ చేయడం, నైట్ కర్ఫ్యూ వలన సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయలేని పరిస్థితి. పైగా ఆంధ్రాలో టికెట్ రేట్ ఇష్యూ ఉండనే ఉంది. వీటన్నింటి వలన చాలా సినిమాలు ల్యాబ్ లోనే ఉండిపోయాయి.
ఈ లిస్ట్ లో నాని ‘టక్ జగదీష్’ సినిమా కూడా ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అందులో నిజం లేదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ లో కూడా నాని తన సినిమా థియేటర్లోనే వస్తుందంటూ పరోక్షంగా కామెంట్స్ చేశారు.
అయితే ఇప్పుడు ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీకి అమ్మేశారని సమాచారం. థియేటర్లు తెరుస్తారని, టికెట్ రేట్లు మారతాయని పరిస్థితులు నార్మల్ అవుతాయని భావించి నిర్మాతలు ఇన్నాళ్లూ ఎదురుచూశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఫస్ట్ వేవ్ లో నాని నటించిన ‘వి’ ఓటీటీలోకి వచ్చింది. వెంటనే మరో సినిమా ఓటీటీ ఎందుకని నాని కూడా ఆగాడు. కానీ ఇప్పుడు నిర్మాతలపై ఆర్ధిక భారం పడడంతో నాని ఒప్పుకోక తప్పలేదు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటించింది.
This post was last modified on August 5, 2021 11:16 am
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…