ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్, అత్యంత డిమాండ్ ఉన్న రైటర్లలో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. పాన్ ఇండియా సినిమాలు పెద్ద ఎత్తున తెరకెక్కుతున్న ప్రస్తుత తరుణంలో వివిధ భాషల్లో పని చేస్తూ ‘పాన్ ఇండియా రైటర్’ అనిపించుకుంటున్నారాయన. ‘బాహుబలి’ తర్వాత ఆయన డిమాండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో చిత్రాలకు ఆయన పని చేశారు. ఇప్పుడు కూడా ఆయన చేతిలో మూణ్నాలుగు భారీ చిత్రాలున్నాయి.
రామాయణంలో సీత పాత్రను తీసుకుని కొత్త ఇతివృత్తంతో ఓ స్క్రిప్టును ఆయన సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ధ్రువీకరించారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాకు కూడా కథ వండే ప్రయత్నంలో ఉన్నారు విజయేంద్ర. ఐతే ఈ సినిమా కథ విషయంలో ఇంకా కాంక్రీట్గా ఏమీ లేదని అంటున్నారాయన. ఇవి కాక విజయేంద్ర ప్రసాద్ ఒక వెరైటీ బయోపిక్కు రెడీ అవుతున్నారు. అది మహారాష్ట్రకు చెందిన రంజిత్ సింగ్ దిశాలే అని ఉపాధ్యాయుడికి సంబంధించిన సినిమా కావడం విశేషం.
తాను పని చేసే పాఠశాలలో విద్యా బోధనకు సంబంధించి వినూత్న మార్పులు తీసుకురావడంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో పేదరికం వల్ల బడికి దూరమవుతున్న అనేకమంది పిల్లల్ని మళ్లీ చదువు వైపు మళ్లించిన టీచర్ రంజిత్ సింగ్. ఒక షెడ్డులో కొనసాగుతున్న పాఠశాలకు భవనం నిర్మించేలా చేయడంతో పాటు స్థానిక భాషల్లో పుస్తకాలు ముద్రించి పిల్లలు సులువుగా పాఠాలు నేర్చుకునేలా కూడా చేశారు. ఈ క్రమంలో గత ఏడాది 124 దేశాల ఉపాధ్యాయులు పోటీ పడ్డ గ్లోబల్ టీచర్ అవార్డుకు రంజిత్ సింగ్ ఎంపికయ్యారు.
మొత్తం 12 వేల మంది పోటీ పడితే.. 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి, చివరికి రంజిత్కు ఈ అవార్డు కట్టబెట్టారు. ఈ అవార్డుతో పాటు మిలియన్ డాలర్ల (దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీ దక్కగా.. తనతో పాటు ఫైనల్కు చేరిన మిగతా తొమ్మిది మంది కూడా ఈ అవార్డుకు అర్హులే అంటూ అందులో సగం ప్రైజ్ మనీని వారికి పంచేశారు రంజిత్. ఈ విశేషాలన్నీ వెల్లడిస్తూ తాను ఆ టీచర్ బయోపిక్ రాస్తున్నట్లు విజయేంద్ర వెల్లడించారు. పాన్ ఇండియా లెవెల్లోనే ఈ సినిమా తెరకెక్కే అవకాశముంది. ఈ చిత్రానికి కథానాయకుడెవరు.. దర్శక నిర్మాతలెవరు అన్నది విజయేంద్ర ఇంకా చెప్పలేదు.
This post was last modified on August 3, 2021 12:35 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…