ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో శిల్పాశెట్టి ఇమేజ్ పై దెబ్బ పడింది. ఆమె కెరీర్ పై రాజ్ కుంద్రా అరెస్ట్ ఎఫెక్ట్ చూపిస్తోంది. శిల్పా తన ఆదాయాన్ని కోట్లలో కోల్పోతుంది. బుల్లితెరపై ఓ డాన్స్ షోకి ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. ఎప్పుడైతే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేస్తారో అప్పటినుండి ఆమె టీవీ షోలో కనిపించడం లేదు.
ఒక్కో ఎపిసోడ్ కి శిల్పాశెట్టి రూ.18 నుండి రూ.22 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది. కానీ కొన్నిరోజులుగా ఆమె షూటింగ్ కి రావడం లేదు. దీని వలన ఆమె మొత్తంగా రూ.2 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. రీసెంట్ గా ఈ డాన్స్ షోకి జడ్జిగా కరిష్మా కపూర్ ఒక ఎపిసోడ్ లో కనిపించింది. ఆ తరువాత జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ లను తీసుకొచ్చారు. అయితే వీరంతా ఒక్కో ఎపిసోడ్ లో కనిపించి వెళ్లిపోయారు.
ఎక్కువ రోజులు ఇలా గెస్ట్ జడ్జిలతో షోని నడిపించలేరు. దీంతో అసలు షోలో శిల్పాశెట్టిని ఉంచాలా..? లేదా అనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. రాజ్ కుంద్రా కేసు ఓ కొలిక్కి వస్తే గానీ శిల్పాశెట్టి బయటకు రాలేదు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. రీసెంట్ గా శిల్పాశెట్టి తన ట్విట్టర్ లో రాజ్ కుంద్రా అరెస్ట్ పై ఓ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనపై అసత్య ప్రచారాలు చేయొద్దంటూ మీడియాకు రిక్వెస్ట్ చేసింది.
This post was last modified on August 3, 2021 8:59 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…