విజయ్ సేతుపతి.. ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడు. తమిళంలో అతడి మేనియా గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ.. గత కొన్నేళ్లలో వేరే భాషల్లోకి కూడా అతడి క్రేజ్ విస్తరించింది. సేతుపతిని దృష్టిలో ఉంచుకుని పాత్రలు రాయడం.. లేదా తాము రాసిన పాత్రలకు సేతుపతే న్యాయం చేయగలడని అతడి కోసం ప్రయత్నించడం చేస్తున్నారు తెలుగు, ఇతర భాషల ఫిలిం మేకర్స్.
తెలుగులో ఇప్పటికే సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించిన సేతుపతిని ‘పుష్ప’లో కూడా నటింపజేయాలని చూశారు కానీ.. అప్పటికి డేట్లు సర్దుబాటు కాక ఈ చిత్రాన్ని ఒప్పుకోలేదు సేతుపతి. ఐతే తెలుగులో మరిందరు డైరెక్టర్లు సేతుపతి కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఓ తెలుగు చిత్రానికి సేతుపతి ఓకే అనేశాడట. అందులో యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరో అని అంటున్నారు.
సందీప్తో మంచి అనుబంధం ఉన్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాజ్-డీకే.. తెలుగులో ఓ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించనున్నారట. ఇంతకుముందు సందీప్తోనే ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాను నిర్మించారు రాజ్-డీకే. అది సరిగా ఆడలేదు. హిందీలో వీళ్లిద్దరూ రూపొందించిన ‘షోర్ ఇన్ ద సిటీ’.. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్లో సందీప్ నటించాడు. ఇప్పుడు సందీప్ హీరోగా వేరే నిర్మాతతో కలిసి తెలుగులో సినిమా తీయబోతున్నారట రాజ్-డీకే. భరత్ చౌదరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో సందీప్కు విలన్గా విజయ్ సేతుపతి నటించనున్నాడట.
సినిమాలో హీరోను మించి హైలైట్ అయ్యేలా విలన్ పాత్ర ఉంటుందని.. దానికి సేతుపతి అయితేనే న్యాయం చేయగలడని అతణ్ని సంప్రదించారని.. తన పాత్ర నచ్చడంతో పాటు మంచి టీం కలిసి చేస్తున్న సినిమా కావడంతో అతను ఓకే అన్నాడని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.
This post was last modified on August 2, 2021 6:49 pm
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…