విజయ్ సేతుపతి.. ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడు. తమిళంలో అతడి మేనియా గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ.. గత కొన్నేళ్లలో వేరే భాషల్లోకి కూడా అతడి క్రేజ్ విస్తరించింది. సేతుపతిని దృష్టిలో ఉంచుకుని పాత్రలు రాయడం.. లేదా తాము రాసిన పాత్రలకు సేతుపతే న్యాయం చేయగలడని అతడి కోసం ప్రయత్నించడం చేస్తున్నారు తెలుగు, ఇతర భాషల ఫిలిం మేకర్స్.
తెలుగులో ఇప్పటికే సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించిన సేతుపతిని ‘పుష్ప’లో కూడా నటింపజేయాలని చూశారు కానీ.. అప్పటికి డేట్లు సర్దుబాటు కాక ఈ చిత్రాన్ని ఒప్పుకోలేదు సేతుపతి. ఐతే తెలుగులో మరిందరు డైరెక్టర్లు సేతుపతి కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఓ తెలుగు చిత్రానికి సేతుపతి ఓకే అనేశాడట. అందులో యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరో అని అంటున్నారు.
సందీప్తో మంచి అనుబంధం ఉన్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాజ్-డీకే.. తెలుగులో ఓ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించనున్నారట. ఇంతకుముందు సందీప్తోనే ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాను నిర్మించారు రాజ్-డీకే. అది సరిగా ఆడలేదు. హిందీలో వీళ్లిద్దరూ రూపొందించిన ‘షోర్ ఇన్ ద సిటీ’.. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్లో సందీప్ నటించాడు. ఇప్పుడు సందీప్ హీరోగా వేరే నిర్మాతతో కలిసి తెలుగులో సినిమా తీయబోతున్నారట రాజ్-డీకే. భరత్ చౌదరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో సందీప్కు విలన్గా విజయ్ సేతుపతి నటించనున్నాడట.
సినిమాలో హీరోను మించి హైలైట్ అయ్యేలా విలన్ పాత్ర ఉంటుందని.. దానికి సేతుపతి అయితేనే న్యాయం చేయగలడని అతణ్ని సంప్రదించారని.. తన పాత్ర నచ్చడంతో పాటు మంచి టీం కలిసి చేస్తున్న సినిమా కావడంతో అతను ఓకే అన్నాడని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.
This post was last modified on August 2, 2021 6:49 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…