ఒక హీరోకు వీరాభిమానిగా ఉండి.. అదే హీరోతో సినిమా తీసే అవకాశం దక్కించుకోవడం అరుదైన విషయం. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ ఈ కోవకే చెందుతాడు. అతను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. గుంటూరు జిల్లా చిరంజీవి అభిమానుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు యుక్త వయసులో.
చిరు స్ఫూర్తితోనే సినిమా రంగంలోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగి దర్శకుడిగా మారాడు. రవితేజతో తీసిన సూపర్ హిట్ మూవీ ‘పవర్’తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన అతను.. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ చిత్రాలను రూపొందించడం తెలిసిందే.
ఇప్పుడు చిరంజీవితో ఓ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. స్క్రిప్టు పూర్తయింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఆదివారం బాబి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిరు సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు బాబీ.
ఒక అభిమానికి, ఒక స్టార్కు మధ్య అనుబంధమే చిరుతో తాను చేస్తున్న సినిమా కథకి స్ఫూర్తి అని.. ఒక్క మాటలో చెప్పాలంటే చిరునే ఈ సినిమాకు ఇన్స్పిరేషన్ అని బాబీ అన్నాడు. ఒక హీరోను ఆరాధించే అభిమాని.. తమ హీరోకు ఎలాంటి ఇంట్రడక్షన్ సీన్ ఉండాలని కోరుకుంటాడో.. ఎలా కనిపిస్తే విజిల్స్ పడతాయని ఆశిస్తాడో చిరుకు సంబంధించి అలాంటి మూమెంట్స్ తన మనసులో చాలా ఏళ్ల నుంచి ఉన్నాయని.. అవే రెండేళ్లుగా సీరియస్గా తనతో చిరంజీవి కోసం కథ రాయించాయని బాబీ తెలిపాడు.
తొలిసారి చిరంజీవికి కథ చెబుతున్నప్పుడు చిన్న భయం, బెరుకు, ఆనందం అన్నీ కలగలిసిన అనుభూతి కలిగిందని.. గంటసేపు కథ చెప్పాక ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారని బాబీ వెల్లడించాడు. అభిమానులకి ఏం కావాలో అన్నీ ఈ సినిమాలో ఉంటాయని.. ‘ఘరానా మొగుడు’, ‘గ్యాంగ్లీడర్’, ‘రౌడీ అల్లుడు’… ఇలా తాను ఏయే సినిమాలు చూసి విజిల్స్ కొట్టానో అలాగే తాను చిరుతో చేస్తున్న సినిమా ఉంటుందని.. దసరా నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని బాబీ చెప్పాడు.
This post was last modified on August 2, 2021 10:36 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…