ఒక హీరోకు వీరాభిమానిగా ఉండి.. అదే హీరోతో సినిమా తీసే అవకాశం దక్కించుకోవడం అరుదైన విషయం. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ ఈ కోవకే చెందుతాడు. అతను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. గుంటూరు జిల్లా చిరంజీవి అభిమానుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు యుక్త వయసులో.
చిరు స్ఫూర్తితోనే సినిమా రంగంలోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగి దర్శకుడిగా మారాడు. రవితేజతో తీసిన సూపర్ హిట్ మూవీ ‘పవర్’తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన అతను.. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ చిత్రాలను రూపొందించడం తెలిసిందే.
ఇప్పుడు చిరంజీవితో ఓ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. స్క్రిప్టు పూర్తయింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఆదివారం బాబి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిరు సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు బాబీ.
ఒక అభిమానికి, ఒక స్టార్కు మధ్య అనుబంధమే చిరుతో తాను చేస్తున్న సినిమా కథకి స్ఫూర్తి అని.. ఒక్క మాటలో చెప్పాలంటే చిరునే ఈ సినిమాకు ఇన్స్పిరేషన్ అని బాబీ అన్నాడు. ఒక హీరోను ఆరాధించే అభిమాని.. తమ హీరోకు ఎలాంటి ఇంట్రడక్షన్ సీన్ ఉండాలని కోరుకుంటాడో.. ఎలా కనిపిస్తే విజిల్స్ పడతాయని ఆశిస్తాడో చిరుకు సంబంధించి అలాంటి మూమెంట్స్ తన మనసులో చాలా ఏళ్ల నుంచి ఉన్నాయని.. అవే రెండేళ్లుగా సీరియస్గా తనతో చిరంజీవి కోసం కథ రాయించాయని బాబీ తెలిపాడు.
తొలిసారి చిరంజీవికి కథ చెబుతున్నప్పుడు చిన్న భయం, బెరుకు, ఆనందం అన్నీ కలగలిసిన అనుభూతి కలిగిందని.. గంటసేపు కథ చెప్పాక ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారని బాబీ వెల్లడించాడు. అభిమానులకి ఏం కావాలో అన్నీ ఈ సినిమాలో ఉంటాయని.. ‘ఘరానా మొగుడు’, ‘గ్యాంగ్లీడర్’, ‘రౌడీ అల్లుడు’… ఇలా తాను ఏయే సినిమాలు చూసి విజిల్స్ కొట్టానో అలాగే తాను చిరుతో చేస్తున్న సినిమా ఉంటుందని.. దసరా నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని బాబీ చెప్పాడు.
This post was last modified on August 2, 2021 10:36 am
ఇప్పుడు ఫ్యానిజానికి అర్థమే మారిపోయింది. తమ అభిమాన కథానాయకుడి మీద ప్రేమ చూపించడం కంటే.. ఆ హీరోకు పోటీగా ఉన్న…
హీరోయిన్ కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభంలో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాల్లో నేను లోకల్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని…
కొంచెం డివైడ్ టాక్ వచ్చినా సరే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ తొలి వీకెండ్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. సోమవారం…
నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా తెగ ప్రచారం చేస్తున్న రామాయణ బృందం దానికి తగ్గ ప్రమోషనల్ స్ట్రాటజీ పాటించడం లేదు.…
మొన్న భారీ ఎత్తున అభిమానులను ఒక చోటికి చేర్చి ఒక మెగా బ్లడ్ క్యాంప్ పెట్టాడు తమిళ కథానాయకుడు ధనుష్.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ సంకటం ఏర్పడింది. 2023లో రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ మూసీ…