యువ దర్శకుడు మారుతి టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్. చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ రోజుల్లో, పరిమిత వనరులతో వినోదాత్మక సినిమాలు తీయడం ద్వారా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడతను. అర కోటి కూడా ఖర్చవని ‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో అతడి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కూడా తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసి పెద్ద హిట్లు కొట్టాడు.
తర్వాత నాని, వెంకటేష్ లాంటి స్టార్లతో సినిమాలు తీశాడు. ఇప్పుడు స్టార్లతో సినిమాలు చేస్తున్నా కూడా మారుతి మరీ ఎక్కువ ఖర్చు పెట్టించడని.. అనవసర హంగామాకు పోడని అంటారు. యూత్కు, ఫ్యామిలీస్కు నచ్చే సింపుల్ ఎంటర్టైనర్లతో అతడి ప్రయాణం సాగిపోతోంది. ఇలాంటి దర్శకుడి నుంచి గ్రాఫిక్స్ ప్రధానంగా ఒక భారీ విజువల్ వండర్ వస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే విచిత్రంగా అనిపిస్తోంది కదా? మారుతి అలాంటి సినిమా తీయగలడా అన్న సందేహాలు కూడా కలుగుతాయి.కానీ తాను ఆ టైపు సినిమా తీయగలనని అంటున్నాడు మారుతి.
ఈ తరహా చిత్రాలకు పని చేసిన అనుభవం కూడా తనకు ఉందని మారుతి చెప్పాడు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్కెచింగ్ చేయడం, స్గోరీ బోర్డ్ వేయడం లాంటి పనులు చేశానని.. ఆ క్రమంలో ‘అంజి’ లాంటి భారీ చిత్రానికి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి పిలిచి అవకాశం ఇచ్చారని.. ఆ అనుభవం తనకెంతో ఉపయోగపడిందని ఓ టీవీ కార్యక్రమంలో మారుతి వెల్లడించాడు.
గ్రాఫిక్స్ ప్రధానంగా సినిమాలు తీయగలరా అని అడిగితే.. కచ్చితంగా చేయగలనని.. తాను ఆ తరహా సినిమా చేస్తే అది నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్గా ఉంటుందని తెలిపాడు మారుతి. భవిష్యత్తులో కచ్చితంగా ఈ తరహా భారీ చిత్రం చేస్తానని మారుతి ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతను గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ తీస్తున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందు అతడి నుంచి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే చిత్రం రాబోతోంది.
This post was last modified on August 1, 2021 6:06 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…