కొందరు దర్శకుల సినిమాలను చూస్తే వారిలో విషయం ఉన్నట్లే అనిపిస్తుంది. ఏదో కొత్తగా చేయాలనే తపనా కనిపిస్తుంది. కానీ తాము ఎంచుకున్న కథలను సరిగా చెప్పలేక ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటూ ఉంటారు. అనిల్ కృష్ణ కన్నెగంటి అనే యువ దర్శకుడి పరిస్థితి ఇదే.
అతను దశాబ్దంన్నర కిందట అసాధ్యుడు అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతనొక్కడే చిత్రంతో బ్లాక్బస్టర్ కొట్టి ఊపుమీదున్న నందమూరి కళ్యాణ్ రామ్.. దాని తర్వాత చేసిన చిత్రమిదే. మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కథ కొంచెం భిన్నమైనదే అయినా ట్రీట్మెంట్ సరిగా లేక ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత కొన్నేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్ హీరోగా మిస్టర్ నూకయ్య అనే మరో వెరైటీ సినిమా తీశాడు అనిల్. ఆ చిత్రానికి విడుదల ముంగిట మాంచి హైప్ వచ్చింది కానీ.. అది కూడా సరిగా ఆడలేదు. మళ్లీ అనిల్ కెరీర్లో గ్యాప్ వచ్చింది.
ఈసారి తమిళ హిట్ నేరమ్ను రన్ పేరుతో రీమేక్ చేశాడు. సందీప్ కిషన్ హీరో. అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. అనిల్ కెరీర్కు ఈసారి మరింత బ్రేక్ పడింది. టాలీవుడ్లో ఆ దర్శకుడి ఉనికి ప్రశ్నార్థకమైపోయింది. ఇక మళ్లీ కనిపించడనుకున్న దర్శకుడు ఇప్పుడో కొత్త చిత్రంతో వస్తున్నాడు. యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకాకర్ తమ్ముడు అశ్విన్ బాబు ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
ఎక్కువగా అన్నతోనే సినిమాలు చేసిన అశ్విన్.. బయట ఫుల్ లెంగ్త్ హీరోగా చేస్తున్న సినిమా ఇది. దీని ప్రి లుక్ చూస్తే యాక్షన్ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తోంది. ఈసారి సొంత కథతోనే వస్తున్నాడు అనిల్. సినిమా సినిమాకూ తగ్గుతూ వచ్చిన అతడి రేంజ్.. ఈ చిత్రం తర్వాత ఏమవుతుందో చూడాలి. ఈసారి హిట్టు కొట్టకపోతే అనిల్ ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం కావడం ఖాయం.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…