కొందరు దర్శకుల సినిమాలను చూస్తే వారిలో విషయం ఉన్నట్లే అనిపిస్తుంది. ఏదో కొత్తగా చేయాలనే తపనా కనిపిస్తుంది. కానీ తాము ఎంచుకున్న కథలను సరిగా చెప్పలేక ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటూ ఉంటారు. అనిల్ కృష్ణ కన్నెగంటి అనే యువ దర్శకుడి పరిస్థితి ఇదే.
అతను దశాబ్దంన్నర కిందట అసాధ్యుడు అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతనొక్కడే చిత్రంతో బ్లాక్బస్టర్ కొట్టి ఊపుమీదున్న నందమూరి కళ్యాణ్ రామ్.. దాని తర్వాత చేసిన చిత్రమిదే. మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కథ కొంచెం భిన్నమైనదే అయినా ట్రీట్మెంట్ సరిగా లేక ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత కొన్నేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్ హీరోగా మిస్టర్ నూకయ్య అనే మరో వెరైటీ సినిమా తీశాడు అనిల్. ఆ చిత్రానికి విడుదల ముంగిట మాంచి హైప్ వచ్చింది కానీ.. అది కూడా సరిగా ఆడలేదు. మళ్లీ అనిల్ కెరీర్లో గ్యాప్ వచ్చింది.
ఈసారి తమిళ హిట్ నేరమ్ను రన్ పేరుతో రీమేక్ చేశాడు. సందీప్ కిషన్ హీరో. అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. అనిల్ కెరీర్కు ఈసారి మరింత బ్రేక్ పడింది. టాలీవుడ్లో ఆ దర్శకుడి ఉనికి ప్రశ్నార్థకమైపోయింది. ఇక మళ్లీ కనిపించడనుకున్న దర్శకుడు ఇప్పుడో కొత్త చిత్రంతో వస్తున్నాడు. యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకాకర్ తమ్ముడు అశ్విన్ బాబు ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
ఎక్కువగా అన్నతోనే సినిమాలు చేసిన అశ్విన్.. బయట ఫుల్ లెంగ్త్ హీరోగా చేస్తున్న సినిమా ఇది. దీని ప్రి లుక్ చూస్తే యాక్షన్ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తోంది. ఈసారి సొంత కథతోనే వస్తున్నాడు అనిల్. సినిమా సినిమాకూ తగ్గుతూ వచ్చిన అతడి రేంజ్.. ఈ చిత్రం తర్వాత ఏమవుతుందో చూడాలి. ఈసారి హిట్టు కొట్టకపోతే అనిల్ ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం కావడం ఖాయం.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…