Movie News

పరువునష్టం కేసులోనూ శిల్పకు ఎదురుదెబ్బ తప్పలేదుగా!


బాలీవుడ్ ను మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బూతు సినిమాల వ్యవహారం. ఓటీటీ పేరుతో అశ్లీల సినిమాలు తీయటం.. సదరు బూతు సినిమాల కోసం నటీమణులపై ఒత్తిడి తెచ్చిన వైనంతో పాటు.. ఈ సినిమాల కోసం అతడు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గడిచిన రెండు వారాలుగా శిల్పాశెట్టి – ఆయన భర్తకు సంబంధించిన వార్తలు మీడియాలోనూ..సోషల్ మీడియాలో హాట్ హాట్ గా మారాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన కథనాలు భారీగానే వెలువడ్డాయి.

ఇలాంటివేళ.. తన పరువుకు భంగం వాటిల్లుతోందంటూ ప్రముఖ నటి శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బూతు చిత్రాలకు సంబంధించిన ఉదంతంలో రాజ్ కుంద్రా.. శిల్పాశెట్టిపై మీడియా.. సోషల్ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోలేమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బూతు సినిమాల ఎపిసోడ్ లో రాజ్ కుంద్రాను ఇప్పటికే అరెస్టు చేయటం.. వీరిద్దరికి సంబంధించిన పలు విషయాలు ఇప్పటికే మీడియాలో వచ్చేశాయి.

శిల్పాశెట్టి తరఫున వాదనలు వినిపించటానికి కోర్టుకు హాజరైన న్యాయవాది బీరేన్ సరాఫ్ మాట్లాడుతూ.. భార్యభార్తల మధ్య సంభాషణ గురించి మీడియాలో రావటం సరికాదన్నారు. కుంద్రాను వారింటికి పోలీసులు తీసుకెళ్లినప్పుడు శిల్పా భావోద్వేగానికి గురి కావటం.. వారిద్దరి మధ్య వాదులాట చోటు చేసుకోవటం లాంటివి మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రావటం తెలిసిందే. ఈ వార్తల్ని ఉద్దేశించి న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తూ.. పోలీసులు చెప్పిన వివరాల్ని ప్రసారం చేస్తే పరువుకు నష్టం వాటిల్లినట్లు కాదని.. ఇలా ప్రతి విషయాన్ని అడ్డుకోవాలంటే అతి పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

శిల్పాశెట్టి తీవ్రమైన భావోద్వేగానికి గురి కావటం పోలీసుల ముందే జరిగాయని.. పోలీసులు ఇచ్చిన వివరాలతోనే మీడియాలో రిపోర్టులు వచ్చినట్లుగా పేర్కొనటంపై న్యాయమూర్తి జస్టిస్ గౌతం పటేల్ స్పందిస్తూ.. ‘మీరు పబ్లిక్ లైఫ్ ను ఎంచుకున్నారు. సెలబ్రిటీగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాన్ని మైక్రోస్కోప్ నుంచి చూసినంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో మీరు ఏడ్చారు.. మీ భర్తతో వాదులాడారు అన్న విషయాలు పరువు నష్టం కిందకు రావు. మీరు కూడా ఒక మనిషి కదా అన్న భావనను మాత్రమే గుర్తు చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.

మీడియా స్వేచ్ఛను అడ్డుకునేలా తాము నిర్ణయాలు తీసుకోమన్న న్యాయస్థానం.. పిల్లల పెంపకంపై శిల్పా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారన్న అంశాల్ని ప్రచురించే వేళలో మాత్రం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చేలా మీడియా సంయమనం పాటించాలన్న హితవు మాత్రం పలికారు. ఇప్పటికైనా శిల్పకు ఏది పరువు నష్టం అన్న విషయంపై క్లారిటీ వచ్చేసి ఉంటుంది.

This post was last modified on July 31, 2021 10:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

2 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

4 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

5 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

6 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

7 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

8 hours ago