Movie News

పరువునష్టం కేసులోనూ శిల్పకు ఎదురుదెబ్బ తప్పలేదుగా!


బాలీవుడ్ ను మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బూతు సినిమాల వ్యవహారం. ఓటీటీ పేరుతో అశ్లీల సినిమాలు తీయటం.. సదరు బూతు సినిమాల కోసం నటీమణులపై ఒత్తిడి తెచ్చిన వైనంతో పాటు.. ఈ సినిమాల కోసం అతడు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గడిచిన రెండు వారాలుగా శిల్పాశెట్టి – ఆయన భర్తకు సంబంధించిన వార్తలు మీడియాలోనూ..సోషల్ మీడియాలో హాట్ హాట్ గా మారాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన కథనాలు భారీగానే వెలువడ్డాయి.

ఇలాంటివేళ.. తన పరువుకు భంగం వాటిల్లుతోందంటూ ప్రముఖ నటి శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బూతు చిత్రాలకు సంబంధించిన ఉదంతంలో రాజ్ కుంద్రా.. శిల్పాశెట్టిపై మీడియా.. సోషల్ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోలేమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బూతు సినిమాల ఎపిసోడ్ లో రాజ్ కుంద్రాను ఇప్పటికే అరెస్టు చేయటం.. వీరిద్దరికి సంబంధించిన పలు విషయాలు ఇప్పటికే మీడియాలో వచ్చేశాయి.

శిల్పాశెట్టి తరఫున వాదనలు వినిపించటానికి కోర్టుకు హాజరైన న్యాయవాది బీరేన్ సరాఫ్ మాట్లాడుతూ.. భార్యభార్తల మధ్య సంభాషణ గురించి మీడియాలో రావటం సరికాదన్నారు. కుంద్రాను వారింటికి పోలీసులు తీసుకెళ్లినప్పుడు శిల్పా భావోద్వేగానికి గురి కావటం.. వారిద్దరి మధ్య వాదులాట చోటు చేసుకోవటం లాంటివి మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రావటం తెలిసిందే. ఈ వార్తల్ని ఉద్దేశించి న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తూ.. పోలీసులు చెప్పిన వివరాల్ని ప్రసారం చేస్తే పరువుకు నష్టం వాటిల్లినట్లు కాదని.. ఇలా ప్రతి విషయాన్ని అడ్డుకోవాలంటే అతి పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

శిల్పాశెట్టి తీవ్రమైన భావోద్వేగానికి గురి కావటం పోలీసుల ముందే జరిగాయని.. పోలీసులు ఇచ్చిన వివరాలతోనే మీడియాలో రిపోర్టులు వచ్చినట్లుగా పేర్కొనటంపై న్యాయమూర్తి జస్టిస్ గౌతం పటేల్ స్పందిస్తూ.. ‘మీరు పబ్లిక్ లైఫ్ ను ఎంచుకున్నారు. సెలబ్రిటీగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాన్ని మైక్రోస్కోప్ నుంచి చూసినంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో మీరు ఏడ్చారు.. మీ భర్తతో వాదులాడారు అన్న విషయాలు పరువు నష్టం కిందకు రావు. మీరు కూడా ఒక మనిషి కదా అన్న భావనను మాత్రమే గుర్తు చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.

మీడియా స్వేచ్ఛను అడ్డుకునేలా తాము నిర్ణయాలు తీసుకోమన్న న్యాయస్థానం.. పిల్లల పెంపకంపై శిల్పా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారన్న అంశాల్ని ప్రచురించే వేళలో మాత్రం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చేలా మీడియా సంయమనం పాటించాలన్న హితవు మాత్రం పలికారు. ఇప్పటికైనా శిల్పకు ఏది పరువు నష్టం అన్న విషయంపై క్లారిటీ వచ్చేసి ఉంటుంది.

This post was last modified on July 31, 2021 10:45 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

31 mins ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

2 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

3 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

3 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

3 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

4 hours ago