Movie News

చిత్ర‌మైన కాంబినేష‌న్లో వెరైటీ సినిమా

మ‌ల్లేశం అనే మంచి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు రాజ్ రాచ‌కొండ‌. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్న చేనేత కార్మికుడు మ‌ల్లేశం క‌థ‌కు ఎంతో హృద్యంగా వెండితెర రూపం ఇచ్చాడ‌త‌ను. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత మంచి ఫ‌లితాన్ని అందుకోలేదు కానీ.. ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఓటీటీల్లో ఈ సినిమాను జ‌నాలు బాగానే చూశారు. ఇప్పుడీ చిత్ర ద‌ర్శ‌కుడు ఓ విభిన్న ప్ర‌య‌త్నంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఐతే రాజ్ నుంచి ఈసారి వ‌స్తున్న‌ది తెలుగు సినిమా కాదు, దానికి అత‌ను ద‌ర్శ‌కుడూ కాదు. మ‌ల‌యాళంలో నిర్మాత‌గా ప‌క అనే సినిమా చేస్తున్నాడు రాజ్. మ‌ల్లేశం చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా ప‌ని చేసిన మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన నితిన్ లూకాస్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఇదొక వ‌యొలెంట్ మూవీ. ఒక‌రి మీద ఒక‌రు ద్వేషంతో ర‌గిలిపోయే రెండు కుటుంబాల మ‌ధ్య ఈ క‌థ న‌డుస్తుంద‌ట‌. అంద‌రూ కొత్త వాళ్లే ముఖ్య పాత్ర‌లు పోషించారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకుంది. సెప్టెంబ‌రులో జరిగే టొరంటో ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శ‌న‌కు కూడా ఎంపికైంది.

ఈ సినిమా గురించి తెలుసుకుని ప్ర‌ముఖ బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ఇందులో నిర్మాణ భాగ‌స్వామి అయ్యాడు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం కోసం అనురాగ్ ఈ టీంతో క‌లిశాడు. అత‌డికి అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఇలా ఒక తెలుగు ద‌ర్శ‌కుడు.. మ‌ల‌యాళంలో సినిమా తీయ‌డం.. దానికి ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిర్మాణ భాగ‌స్వామిగా మార‌డం విశేష‌మే. ఈ చిత్రాన్ని తెలుగు స‌హా ప‌లు భాష‌ల్లో అనువ‌దించి రిలీజ్ చేయ‌బోతున్నారు.

This post was last modified on July 30, 2021 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

20 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

50 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago