మల్లేశం అనే మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాజ్ రాచకొండ. పద్మశ్రీ పురస్కారం అందుకున్న చేనేత కార్మికుడు మల్లేశం కథకు ఎంతో హృద్యంగా వెండితెర రూపం ఇచ్చాడతను. ఆ సినిమా కమర్షియల్గా అనుకున్నంత మంచి ఫలితాన్ని అందుకోలేదు కానీ.. ప్రశంసలు దక్కించుకుంది. ఓటీటీల్లో ఈ సినిమాను జనాలు బాగానే చూశారు. ఇప్పుడీ చిత్ర దర్శకుడు ఓ విభిన్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఐతే రాజ్ నుంచి ఈసారి వస్తున్నది తెలుగు సినిమా కాదు, దానికి అతను దర్శకుడూ కాదు. మలయాళంలో నిర్మాతగా పక అనే సినిమా చేస్తున్నాడు రాజ్. మల్లేశం చిత్రానికి సౌండ్ ఇంజినీర్గా పని చేసిన మలయాళ ఇండస్ట్రీకి చెందిన నితిన్ లూకాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇదొక వయొలెంట్ మూవీ. ఒకరి మీద ఒకరు ద్వేషంతో రగిలిపోయే రెండు కుటుంబాల మధ్య ఈ కథ నడుస్తుందట. అందరూ కొత్త వాళ్లే ముఖ్య పాత్రలు పోషించారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. సెప్టెంబరులో జరిగే టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు కూడా ఎంపికైంది.
ఈ సినిమా గురించి తెలుసుకుని ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ ఇందులో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయడం కోసం అనురాగ్ ఈ టీంతో కలిశాడు. అతడికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఇలా ఒక తెలుగు దర్శకుడు.. మలయాళంలో సినిమా తీయడం.. దానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిర్మాణ భాగస్వామిగా మారడం విశేషమే. ఈ చిత్రాన్ని తెలుగు సహా పలు భాషల్లో అనువదించి రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on July 30, 2021 12:06 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…