మల్లేశం అనే మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాజ్ రాచకొండ. పద్మశ్రీ పురస్కారం అందుకున్న చేనేత కార్మికుడు మల్లేశం కథకు ఎంతో హృద్యంగా వెండితెర రూపం ఇచ్చాడతను. ఆ సినిమా కమర్షియల్గా అనుకున్నంత మంచి ఫలితాన్ని అందుకోలేదు కానీ.. ప్రశంసలు దక్కించుకుంది. ఓటీటీల్లో ఈ సినిమాను జనాలు బాగానే చూశారు. ఇప్పుడీ చిత్ర దర్శకుడు ఓ విభిన్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఐతే రాజ్ నుంచి ఈసారి వస్తున్నది తెలుగు సినిమా కాదు, దానికి అతను దర్శకుడూ కాదు. మలయాళంలో నిర్మాతగా పక అనే సినిమా చేస్తున్నాడు రాజ్. మల్లేశం చిత్రానికి సౌండ్ ఇంజినీర్గా పని చేసిన మలయాళ ఇండస్ట్రీకి చెందిన నితిన్ లూకాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇదొక వయొలెంట్ మూవీ. ఒకరి మీద ఒకరు ద్వేషంతో రగిలిపోయే రెండు కుటుంబాల మధ్య ఈ కథ నడుస్తుందట. అందరూ కొత్త వాళ్లే ముఖ్య పాత్రలు పోషించారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. సెప్టెంబరులో జరిగే టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు కూడా ఎంపికైంది.
ఈ సినిమా గురించి తెలుసుకుని ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ ఇందులో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయడం కోసం అనురాగ్ ఈ టీంతో కలిశాడు. అతడికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఇలా ఒక తెలుగు దర్శకుడు.. మలయాళంలో సినిమా తీయడం.. దానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిర్మాణ భాగస్వామిగా మారడం విశేషమే. ఈ చిత్రాన్ని తెలుగు సహా పలు భాషల్లో అనువదించి రిలీజ్ చేయబోతున్నారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…