మల్లేశం అనే మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాజ్ రాచకొండ. పద్మశ్రీ పురస్కారం అందుకున్న చేనేత కార్మికుడు మల్లేశం కథకు ఎంతో హృద్యంగా వెండితెర రూపం ఇచ్చాడతను. ఆ సినిమా కమర్షియల్గా అనుకున్నంత మంచి ఫలితాన్ని అందుకోలేదు కానీ.. ప్రశంసలు దక్కించుకుంది. ఓటీటీల్లో ఈ సినిమాను జనాలు బాగానే చూశారు. ఇప్పుడీ చిత్ర దర్శకుడు ఓ విభిన్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఐతే రాజ్ నుంచి ఈసారి వస్తున్నది తెలుగు సినిమా కాదు, దానికి అతను దర్శకుడూ కాదు. మలయాళంలో నిర్మాతగా పక అనే సినిమా చేస్తున్నాడు రాజ్. మల్లేశం చిత్రానికి సౌండ్ ఇంజినీర్గా పని చేసిన మలయాళ ఇండస్ట్రీకి చెందిన నితిన్ లూకాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇదొక వయొలెంట్ మూవీ. ఒకరి మీద ఒకరు ద్వేషంతో రగిలిపోయే రెండు కుటుంబాల మధ్య ఈ కథ నడుస్తుందట. అందరూ కొత్త వాళ్లే ముఖ్య పాత్రలు పోషించారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. సెప్టెంబరులో జరిగే టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు కూడా ఎంపికైంది.
ఈ సినిమా గురించి తెలుసుకుని ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ ఇందులో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయడం కోసం అనురాగ్ ఈ టీంతో కలిశాడు. అతడికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఇలా ఒక తెలుగు దర్శకుడు.. మలయాళంలో సినిమా తీయడం.. దానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిర్మాణ భాగస్వామిగా మారడం విశేషమే. ఈ చిత్రాన్ని తెలుగు సహా పలు భాషల్లో అనువదించి రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on July 30, 2021 12:06 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…