Movie News

చిత్ర‌మైన కాంబినేష‌న్లో వెరైటీ సినిమా

మ‌ల్లేశం అనే మంచి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు రాజ్ రాచ‌కొండ‌. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్న చేనేత కార్మికుడు మ‌ల్లేశం క‌థ‌కు ఎంతో హృద్యంగా వెండితెర రూపం ఇచ్చాడ‌త‌ను. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత మంచి ఫ‌లితాన్ని అందుకోలేదు కానీ.. ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఓటీటీల్లో ఈ సినిమాను జ‌నాలు బాగానే చూశారు. ఇప్పుడీ చిత్ర ద‌ర్శ‌కుడు ఓ విభిన్న ప్ర‌య‌త్నంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఐతే రాజ్ నుంచి ఈసారి వ‌స్తున్న‌ది తెలుగు సినిమా కాదు, దానికి అత‌ను ద‌ర్శ‌కుడూ కాదు. మ‌ల‌యాళంలో నిర్మాత‌గా ప‌క అనే సినిమా చేస్తున్నాడు రాజ్. మ‌ల్లేశం చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా ప‌ని చేసిన మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన నితిన్ లూకాస్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఇదొక వ‌యొలెంట్ మూవీ. ఒక‌రి మీద ఒక‌రు ద్వేషంతో ర‌గిలిపోయే రెండు కుటుంబాల మ‌ధ్య ఈ క‌థ న‌డుస్తుంద‌ట‌. అంద‌రూ కొత్త వాళ్లే ముఖ్య పాత్ర‌లు పోషించారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకుంది. సెప్టెంబ‌రులో జరిగే టొరంటో ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శ‌న‌కు కూడా ఎంపికైంది.

ఈ సినిమా గురించి తెలుసుకుని ప్ర‌ముఖ బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ఇందులో నిర్మాణ భాగ‌స్వామి అయ్యాడు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం కోసం అనురాగ్ ఈ టీంతో క‌లిశాడు. అత‌డికి అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఇలా ఒక తెలుగు ద‌ర్శ‌కుడు.. మ‌ల‌యాళంలో సినిమా తీయ‌డం.. దానికి ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిర్మాణ భాగ‌స్వామిగా మార‌డం విశేష‌మే. ఈ చిత్రాన్ని తెలుగు స‌హా ప‌లు భాష‌ల్లో అనువ‌దించి రిలీజ్ చేయ‌బోతున్నారు.

This post was last modified on July 30, 2021 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

58 minutes ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

2 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

3 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago