Movie News

చిత్ర‌మైన కాంబినేష‌న్లో వెరైటీ సినిమా

మ‌ల్లేశం అనే మంచి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు రాజ్ రాచ‌కొండ‌. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్న చేనేత కార్మికుడు మ‌ల్లేశం క‌థ‌కు ఎంతో హృద్యంగా వెండితెర రూపం ఇచ్చాడ‌త‌ను. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత మంచి ఫ‌లితాన్ని అందుకోలేదు కానీ.. ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఓటీటీల్లో ఈ సినిమాను జ‌నాలు బాగానే చూశారు. ఇప్పుడీ చిత్ర ద‌ర్శ‌కుడు ఓ విభిన్న ప్ర‌య‌త్నంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఐతే రాజ్ నుంచి ఈసారి వ‌స్తున్న‌ది తెలుగు సినిమా కాదు, దానికి అత‌ను ద‌ర్శ‌కుడూ కాదు. మ‌ల‌యాళంలో నిర్మాత‌గా ప‌క అనే సినిమా చేస్తున్నాడు రాజ్. మ‌ల్లేశం చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా ప‌ని చేసిన మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన నితిన్ లూకాస్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఇదొక వ‌యొలెంట్ మూవీ. ఒక‌రి మీద ఒక‌రు ద్వేషంతో ర‌గిలిపోయే రెండు కుటుంబాల మ‌ధ్య ఈ క‌థ న‌డుస్తుంద‌ట‌. అంద‌రూ కొత్త వాళ్లే ముఖ్య పాత్ర‌లు పోషించారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకుంది. సెప్టెంబ‌రులో జరిగే టొరంటో ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శ‌న‌కు కూడా ఎంపికైంది.

ఈ సినిమా గురించి తెలుసుకుని ప్ర‌ముఖ బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ఇందులో నిర్మాణ భాగ‌స్వామి అయ్యాడు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం కోసం అనురాగ్ ఈ టీంతో క‌లిశాడు. అత‌డికి అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఇలా ఒక తెలుగు ద‌ర్శ‌కుడు.. మ‌ల‌యాళంలో సినిమా తీయ‌డం.. దానికి ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిర్మాణ భాగ‌స్వామిగా మార‌డం విశేష‌మే. ఈ చిత్రాన్ని తెలుగు స‌హా ప‌లు భాష‌ల్లో అనువ‌దించి రిలీజ్ చేయ‌బోతున్నారు.

This post was last modified on July 30, 2021 12:06 pm

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

7 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

7 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

7 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

11 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

11 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

11 hours ago