Movie News

శిల్పా శెట్టి పోరాటం వాళ్ల మీద..

తన భర్త పోర్న్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ వాటిని మొబైల్ అప్లికేషన్లలో రిలీజ్ చేస్తున్నాడనే ఆరోపణలతో అరెస్టయి రిమాండు ఎదుర్కొంటుంటే.. శిల్పా శెట్టి న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఐతే ఆమె ఇప్పుడు పోరాడబోయేది మీడియాతో కావడం గమనార్హం. భర్తను బయటికి తేవడానికి చేసే న్యాయ పోరాటం మామూలే. ఆ పని ఓ వైపు జరుగుతుంటుంది. ఈ లోపు మీడియా పని పట్టడానికి సిద్ధమైంది శిల్పా శెట్టి.

రాజ్ కుంద్రా అరెస్టు నేపథ్యంలో అతడి లీలలపై వారం రోజులుగా మీడియాలో బోలెడన్ని కథనాలు వస్తున్నాయి. అతను పోర్నోగ్రఫీకి సంబంధించి ఏం చేశాడు.. ఏమేం అడ్డదారులు తొక్కాడు.. మోడల్స్‌ను ఎలా ఇటు వైపు మళ్లించాడు.. ఈ బిజినెస్‌ను ఎలా రన్ చేశాడు.. పోలీసుల దృష్టిలో ఎలా పడ్డాడు.. అనే విషయాలపై మీడియా జోరుగా కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో శిల్పా శెట్టి గురించి కూడా రకరకాల ఊహాగానాలు మీడియాలో షికారు చేస్తున్నాయి.

ఐతే తమ గురించి ఇలా కథనాలు రావడం శిల్పాను బాధించినట్లుంది. అందుకే బాలీవుడ్ మీడియా సంగతి తేల్చాలనుకున్నారు. మొత్తం ప్రధాన మీడియాలో వచ్చిన కథనాలన్నింటినీ సేకరించి.. 29 సంస్థ మీడియా సంస్థలు.. పలువురు జర్నలిస్ట్‌లపై బాలీవుడ్ నటి శిల్పా పరువు నష్టం కేసు వేసింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త రాజ్‌కుంద్రతో పాటు తమ కుటుంబానికి పరువునష్టం కలిగే విధంగా మీడియాలో కథనాలు వస్తున్నాయని ఆమె పిటిషన్లో పేర్కొంది. ఈ కేసును శుక్రవారం నాడు విచారణకు తీసుకుంటామని బాంబే హైకోర్టు తెలిపింది. కాగా రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్న అమ్మాయిల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

తాజాగా అతడిపై నటి షెర్లీన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో రాజ్‌కుంద్రా, అతడి టీంను ఒక బిజినెస్‌ మీటింగ్‌లో భాగంగా కలిశానని.. అది జరిగాక ఒకసారి అనుకోకుండా రాజ్ తన ఇంటికి వచ్చాడని.. శిల్పాతో తనకు సరైన సంబంధాలు లేవని చెబుతూ.. తనను హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. కుంద్రా ప్రవర్తనతో భయమేసి తప్పించుకుని పారిపోయినట్లు ఆమె వెల్లడించింది. ఆమె పోలీసుల విచారణకు హాజరైన సందర్భంగా ఈ ఆరోపణలు చేసింది.

This post was last modified on July 30, 2021 11:34 am

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

6 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

10 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago