Movie News

జాతిరత్నాలు డైరెక్టర్ ‘పాన్’ మసాలా

జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు కేవీ అనుదీప్. చాలామంది ఇదే అతడి తొలి చిత్రం అనుకున్నారు కానీ.. దానికంటే ముందు అతను ‘పిట్టగోడ’ అనే లవ్ స్టోరీ తీశాడు. ఆ సినిమా వచ్చింది, వెళ్లిది కూడా జనాలకు తెలియదు. అలాంటి సినిమా తర్వాత వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో అవకాశం దక్కించుకుని పేరున్న ఆర్టిస్టులతో ‘జాతిరత్నాలు’ తీశాడు. ఆ సినిమాకు ఎంత మంచి ఫలితం దక్కిందో తెలిసిందే. దీంతో ఒక్కసారిగా హాట్ షాట్ డైరెక్టర్లలో ఒకడిగా మారిపోయాడు.

తనతో సినిమా చేయడానికి టాలీవుడ్లో చాలామంది హీరోలు ఎదురు చూస్తుంటే.. అనుదీప్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఓ తమిళ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఆ హీరోనే.. శివ కార్తికేయన్. మన రవితేజ లాగే తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి పెద్ద రేంజికి ఎదిగాడు శివకార్తికేయన్. తెలుగు ప్రేక్షకులకు అతను పెద్దగా తెలియదు.

ఐతే ఈ మధ్య వరుసగా తమిళ స్టార్లందరూ తెలుగు డైరెక్టర్లతో బహు భాషా చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ధనుష్, విజయ్ లాంటి స్టార్లు ఇప్పటికే తెలుగు దర్శకులతో సినిమాలు ఖరారు చేసుకున్నారు. ఈ కోవలోనే శివ కార్తికయన్.. అనుదీప్‌తో సినిమా చేయనున్నట్లు చెబుతున్నారు.

ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాను నిర్మిస్తున్న ఏషియన్ మూవీస్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మధ్యలో ‘జాతిరత్నాలు’ సీక్వెల్ అని.. ఇంకో ప్రాజెక్టని అనుదీప్ తర్వాతి సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ.. అతను చివరికి శివతోనే సినిమాను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. తన తొలి రెండు చిత్రాలకు భిన్నంగా ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ తీయడానికి అనుదీప్ రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.

This post was last modified on July 29, 2021 6:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago