మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇది పూర్తి కాగానే ‘లూసిఫర్’ సినిమా రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే.
కరోనా ఎఫెక్ట్ గనుక లేకపోతే ఈపాటికే సినిమా షూటింగ్ మొదలయ్యేది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. పైగా ఈ సినిమా స్క్రిప్ట్ చాలా మంది దర్శకుల వద్ద నలిగి నలిగి ఫైనల్ గా మోహన్ రాజా చేతికి వచ్చింది. అది కూడా ఈ సినిమా ఆలస్యం కావడం ఓ రీజన్.
ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా ఓ కొలిక్కి రావడంతో చిరు ‘లూసిఫర్’ రీమేక్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టు 13 నుండి మొదలుపెట్టాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఆగస్టు 13న షూటింగ్ మొదలుపెట్టి గ్యాప్ లేకుండా నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఒరిజినల్ వెర్షన్ లో మంజు వారియర్ పోషించిన పాత్రలో నయనతార కనిపించనుందని అంటున్నారు. అలానే మరికొంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను తీసుకున్నట్లు తెలుస్తోంది. కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
This post was last modified on July 29, 2021 8:46 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…