Movie News

మెగాస్టార్ సెట్స్ పైకి వచ్చేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇది పూర్తి కాగానే ‘లూసిఫర్’ సినిమా రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

కరోనా ఎఫెక్ట్ గనుక లేకపోతే ఈపాటికే సినిమా షూటింగ్ మొదలయ్యేది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. పైగా ఈ సినిమా స్క్రిప్ట్ చాలా మంది దర్శకుల వద్ద నలిగి నలిగి ఫైనల్ గా మోహన్ రాజా చేతికి వచ్చింది. అది కూడా ఈ సినిమా ఆలస్యం కావడం ఓ రీజన్.

ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా ఓ కొలిక్కి రావడంతో చిరు ‘లూసిఫర్’ రీమేక్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టు 13 నుండి మొదలుపెట్టాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఆగస్టు 13న షూటింగ్ మొదలుపెట్టి గ్యాప్ లేకుండా నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుంది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఒరిజినల్ వెర్షన్ లో మంజు వారియర్ పోషించిన పాత్రలో నయనతార కనిపించనుందని అంటున్నారు. అలానే మరికొంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను తీసుకున్నట్లు తెలుస్తోంది. కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

This post was last modified on July 29, 2021 8:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago