మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇది పూర్తి కాగానే ‘లూసిఫర్’ సినిమా రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే.
కరోనా ఎఫెక్ట్ గనుక లేకపోతే ఈపాటికే సినిమా షూటింగ్ మొదలయ్యేది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. పైగా ఈ సినిమా స్క్రిప్ట్ చాలా మంది దర్శకుల వద్ద నలిగి నలిగి ఫైనల్ గా మోహన్ రాజా చేతికి వచ్చింది. అది కూడా ఈ సినిమా ఆలస్యం కావడం ఓ రీజన్.
ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా ఓ కొలిక్కి రావడంతో చిరు ‘లూసిఫర్’ రీమేక్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టు 13 నుండి మొదలుపెట్టాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఆగస్టు 13న షూటింగ్ మొదలుపెట్టి గ్యాప్ లేకుండా నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఒరిజినల్ వెర్షన్ లో మంజు వారియర్ పోషించిన పాత్రలో నయనతార కనిపించనుందని అంటున్నారు. అలానే మరికొంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను తీసుకున్నట్లు తెలుస్తోంది. కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
This post was last modified on July 29, 2021 8:46 am
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…