ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి.. తన నటనతో ప్రేక్షకుల మనసుల్ని దోయటమే కాదు..తన సినిమా ఒకటి వస్తుందంటే చాలు.. అందులో సమ్ థింగ్ ఉంటుందన్న ఫీల్ కలిగించటంలో సక్సెస్ అయ్యారు. తాజాగా తిమ్మరసు టీంతో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో ఆయన సినిమాల కంటే కూడా.. థియేటర్ల గురించి చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. టాలీవుడ్ లో ఇంత మంది నటులు ఉన్నారు కానీ ఎవరూ చెప్పలేనంత ఎఫెక్టివ్ గా థియేటర్లలో సినిమాను ఎందుకు చూడాలో చెప్పేశారని చెప్పాలి.
కరోనా దెబ్బకు థియేటర్లను మూసేయటం.. మరోసారి తెరిచినప్పటికీ సెకండ్ వేవ్ కారణంగా మరోసారి సినిమా థియేటర్లను మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ లాక్ లో భాగంగా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చంటూ పర్మిషన్ ఇచ్చినప్పటికీ సినిమా థియేటర్లు ఓపెన్ కాలేదు. విపరీతమైన తర్జన భర్జన అనంతరం థియేటర్లను ఈ నెల 30నుంచి ఓపెన్ చేయాలని డిసైడ్ కావటం తెలిసిందే.
సెకండ్ వేవ్ అనంతరం ఓపెన్ అవుతున్న థియేటర్లలో చిన్న హీరోలు నటించిన సినిమాలు విడుదల కానున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి సత్యదేవ్ నటించిన తిమ్మరసు. దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రాంను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో సినిమాలు చూడాలన్న కాన్సెప్టును విజయవంతంగా చెప్పారని చెప్పాలి.
ఆయన ఏమన్నారంటే.. ‘కరోనా వేళ అన్నింటికంటే ముందు థియేటర్లు మూస్తారు. అన్నింటి కంటే చివరన థియేటర్లు తెరుస్తారు. బయట ఉండే ఇతర ప్రదేశాల కంటే థియేటర్ చాలా సురక్షితం. ఒకరితో ఒకరం మాట్లాడుకోం. మాస్కులు వేసుకొని సినిమా చూస్తాం’’ వ్యాఖ్యానించారు. థియేటర్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అని.. దాని మీద చాలామంది ఆధారపడి ఉంటారన్నారు.
థియేటర్ల మూసి ఉంచటం చాలా చిన్న సమస్యగా తోస్తుంది కానీ.. ఇది చాలా పెద్ద సమస్య అని అన్నారు. పరిస్థితులు చక్కబడకుంటే మన తర్వాతి తరం థియేటర్స్ అనుభూతిని మిస్ అవుతారన్నారు. తిమ్మరుసు.. ఈ నెల 30న విడుదలయ్యే సినిమాలకు ఆక్సిజన్ కావాలన్ననాని.. తన కుటుంబంతో కలిసి సినిమాను చూస్తానని పేర్కొన్నారు. మొత్తానికి తిమ్మరుసు కార్యక్రమానికి వచ్చి.. థియేటర్లలో సినిమాల్ని చూడాలన్న ప్రమోషన్ ను విజయవంతంగా పూర్తి చేశారని చెప్పాలి.
This post was last modified on July 28, 2021 11:28 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…