టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన కలిసి రామాయణ గాథ నేపథ్యంలో ఓ భారీ చిత్రం తీయడానికి కొన్నేళ్ల కిందట సన్నాహాలు మొదులపెట్టిన సంగతి తెలిసిందే. వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో రామాయణం సినిమా వస్తుందని కొన్నేళ్ల కిందటే ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.
ఐతే ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి చూస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్పటికే కొన్ని ఊహాగానాలు నడిచాయి. ఐతే నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. దసరాకు ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూను వెల్లడించనున్నట్లు ప్రకటించాడు. ఇక అప్పట్నుంచి ఈ సినిమాలో ముఖ్య తారాగణం గురించి ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
ప్రస్తుతానికి హృతిక్ రోషన్, దీపికా పదుకొనే ఈ రామాయణం సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఓ కీలక పాత్ర చేస్తాడని ముందు నుంచి ఊహాగానాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ సినిమాకు నో చెప్పేశాడట.
అతణ్ని ఈ సినిమాకు సంప్రదించడం వాస్తవమే అని.. ఐతే ఈ చిత్రానికి బల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉండటం, రాజమౌళితో చేయాల్సిన సినిమాతో క్లాష్ అయ్యే అవకాశం ఉండటంతో మహేష్ ఈ ప్రాజెక్టును అంగీకరించలేని స్థితిలో పడ్డాడని జోరుగా ప్రచారం సాగుతోంది. మహేష్ నో చెప్పేయడంతో సౌత్ నుంచే మరో స్టార్ హీరోతో ఈ పాత్ర చేయించాలని చూస్తున్నారట మేకర్స్. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో ఈ మెగా మూవీ తెరకెక్కనుంది. మహేష్-రాజమౌళి చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
This post was last modified on July 27, 2021 12:09 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…