టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన కలిసి రామాయణ గాథ నేపథ్యంలో ఓ భారీ చిత్రం తీయడానికి కొన్నేళ్ల కిందట సన్నాహాలు మొదులపెట్టిన సంగతి తెలిసిందే. వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో రామాయణం సినిమా వస్తుందని కొన్నేళ్ల కిందటే ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.
ఐతే ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి చూస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్పటికే కొన్ని ఊహాగానాలు నడిచాయి. ఐతే నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. దసరాకు ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూను వెల్లడించనున్నట్లు ప్రకటించాడు. ఇక అప్పట్నుంచి ఈ సినిమాలో ముఖ్య తారాగణం గురించి ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
ప్రస్తుతానికి హృతిక్ రోషన్, దీపికా పదుకొనే ఈ రామాయణం సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఓ కీలక పాత్ర చేస్తాడని ముందు నుంచి ఊహాగానాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ సినిమాకు నో చెప్పేశాడట.
అతణ్ని ఈ సినిమాకు సంప్రదించడం వాస్తవమే అని.. ఐతే ఈ చిత్రానికి బల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉండటం, రాజమౌళితో చేయాల్సిన సినిమాతో క్లాష్ అయ్యే అవకాశం ఉండటంతో మహేష్ ఈ ప్రాజెక్టును అంగీకరించలేని స్థితిలో పడ్డాడని జోరుగా ప్రచారం సాగుతోంది. మహేష్ నో చెప్పేయడంతో సౌత్ నుంచే మరో స్టార్ హీరోతో ఈ పాత్ర చేయించాలని చూస్తున్నారట మేకర్స్. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో ఈ మెగా మూవీ తెరకెక్కనుంది. మహేష్-రాజమౌళి చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
This post was last modified on July 27, 2021 12:09 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…