Movie News

ఆ మెగా ప్రాజెక్టుకు మ‌హేష్ బాబు నో?


టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మధు మంతెన క‌లిసి రామాయ‌ణ గాథ నేప‌థ్యంలో ఓ భారీ చిత్రం తీయ‌డానికి కొన్నేళ్ల కింద‌ట స‌న్నాహాలు మొదుల‌పెట్టిన సంగతి తెలిసిందే. వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్లో రామాయ‌ణం సినిమా వ‌స్తుంద‌ని కొన్నేళ్ల కింద‌టే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది.

ఐతే ఈ ఏడాది చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి చూస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్ప‌టికే కొన్ని ఊహాగానాలు న‌డిచాయి. ఐతే నిర్మాత‌ల్లో ఒక‌రైన మ‌ధు మంతెన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ద‌స‌రాకు ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ప్ర‌కటించాడు. ఇక అప్ప‌ట్నుంచి ఈ సినిమాలో ముఖ్య తారాగ‌ణం గురించి ఊహాగానాలు మ‌రింత ఊపందుకున్నాయి.

ప్ర‌స్తుతానికి హృతిక్ రోష‌న్, దీపికా ప‌దుకొనే ఈ రామాయ‌ణం సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సైతం ఓ కీల‌క పాత్ర చేస్తాడ‌ని ముందు నుంచి ఊహాగానాలు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్ర‌కారం మ‌హేష్ ఈ సినిమాకు నో చెప్పేశాడ‌ట‌.

అత‌ణ్ని ఈ సినిమాకు సంప్ర‌దించ‌డం వాస్త‌వ‌మే అని.. ఐతే ఈ చిత్రానికి బ‌ల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉండ‌టం, రాజ‌మౌళితో చేయాల్సిన సినిమాతో క్లాష్ అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో మ‌హేష్ ఈ ప్రాజెక్టును అంగీక‌రించ‌లేని స్థితిలో ప‌డ్డాడ‌ని జోరుగా ప్రచారం సాగుతోంది. మహేష్ నో చెప్పేయ‌డంతో సౌత్ నుంచే మ‌రో స్టార్ హీరోతో ఈ పాత్ర చేయించాల‌ని చూస్తున్నార‌ట మేక‌ర్స్. దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మెగా మూవీ తెర‌కెక్క‌నుంది. మహేష్-రాజమౌళి చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

This post was last modified on July 27, 2021 12:09 pm

Share

Recent Posts

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

56 minutes ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

2 hours ago

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

3 hours ago

ఆ ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం… విజయ్ సంచలనం

తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…

3 hours ago

నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…

3 hours ago

మలేరియా టాబ్లెట్లు మింగి ఒక బాలిక మృతి… 53 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన…

4 hours ago