మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు చిత్రబృందం కొత్త షెడ్యూల్ ని కాకినాడలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తుంది. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను కాకినాడ పోర్ట్ లో తీయాలని అనుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో కాకినాడ పోర్ట్ లో షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. తెలుగు ఫిలిం మేకర్స్ కు అదొక ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది.
అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో కొన్ని సన్నివేశాలను కాకినాడ పోర్ట్ లోనే చిత్రీకరించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ‘ఆచార్య’ టీమ్ కూడా అక్కడే షూటింగ్ నిర్వహించనుంది. వచ్చే నెలాఖరుకి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రామ్ చరణ్.. సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నారు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి వెంటనే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రికార్డింగ్స్ జరుగుతున్నాయి. తమన్ ఆ పనుల్లో తలమునకలై ఉన్నారు.
This post was last modified on July 27, 2021 7:59 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…