మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు చిత్రబృందం కొత్త షెడ్యూల్ ని కాకినాడలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తుంది. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను కాకినాడ పోర్ట్ లో తీయాలని అనుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో కాకినాడ పోర్ట్ లో షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. తెలుగు ఫిలిం మేకర్స్ కు అదొక ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది.
అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో కొన్ని సన్నివేశాలను కాకినాడ పోర్ట్ లోనే చిత్రీకరించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ‘ఆచార్య’ టీమ్ కూడా అక్కడే షూటింగ్ నిర్వహించనుంది. వచ్చే నెలాఖరుకి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రామ్ చరణ్.. సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నారు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి వెంటనే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రికార్డింగ్స్ జరుగుతున్నాయి. తమన్ ఆ పనుల్లో తలమునకలై ఉన్నారు.
This post was last modified on July 27, 2021 7:59 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…