టాలీవుడ్లో పరిమిత వనరులతోనే క్వాలిటీ తగ్గకుండా సూపర్ ఫాస్ట్గా సినిమాలు తీసే దర్శకుల్లో మారుతి ఒకడు. తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ దగ్గర్నుంచి అతడికి ఇదే బాట. స్క్రిప్టు రాయడంలో, సినిమాలు తీయడంలో అతను చాలా వేగం చూపిస్తుంటాడు.
కాబట్టే తక్కువ సమయంలో చాలా సినిమాలు చేసేశాడు. ఇప్పుడతను రికార్డు వేగంతో ఓ సినిమాను పూర్తి చేశాడు. అదే.. మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రానికి స్క్రిప్టును 20 రోజుల్లోనే పూర్తి చేసేశాడట మారుతి. ఇక షూటింగేమో నెల రోజుల్లో అయిపోయిందట. థియేటర్లు తెరుచుకుని ఉంటే ఈపాటికి సినిమాను కూడా రిలీజ్ చేసేవాళ్లం అంటున్నాడు మారుతి.
20 రోజుల్లో కథ రాసిన తాను.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని.. ఇంకో పది రోజులకు రిలీజ్ చేసేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు అతను ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా వెల్లడించాడు.
తన టీం తన టార్గెట్కు అనుగుణంగా అద్భుతంగా పని చేసిందని.. పక్కా ప్లాన్ ప్రకారం సినిమాను పూర్తి చేశామని అతను తెలిపాడు. ‘మంచి రోజులు వచ్చాయి’ ఏదో మామూలుగా రాసి తీసేసిన సినిమా కాదని.. ఈ టైంలో ఈ చిత్రం చాలా అవసరం అని చేసిందని.. నిజానికి ప్రకృతే తమతో ఈ సినిమా చేయించుకుందని మారుతి అన్నాడు.
కరోనా కారణంగా బాధల్లో ఉన్న ప్రేక్షకులకు ఇది ఒక మందు లాంటి సినిమా అని.. తన బలం కామెడీ కాబట్టి.. ఆ కామెడీ మందుతో జనాలకు ఉపశమనం ఇవ్వాలని అనుకున్నానని.. అందుకే ఈ సినిమాకు ‘లాఫింగ్ థెరపీ’ అని క్యాప్షన్ కూడా పెట్టానని మారుతి అన్నాడు.
ఈ చిత్రంలో చాలా చిత్రమైన పాత్రలు ఉంటాయని.. అవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని మారుతి ధీమా వ్యక్తం చేశాడు. ‘ఏక్ మిని కథ’ను నిర్మించిన యువి కాన్సెప్ట్స్ బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కింది. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించారు. గోపీచంద్తో తీస్తున్న ‘పక్కా కమర్షియల్’ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని మారుతి ఈ సినిమాను లాగించేయడం విశేషం.
This post was last modified on July 25, 2021 11:57 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…