టాలీవుడ్లో పరిమిత వనరులతోనే క్వాలిటీ తగ్గకుండా సూపర్ ఫాస్ట్గా సినిమాలు తీసే దర్శకుల్లో మారుతి ఒకడు. తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ దగ్గర్నుంచి అతడికి ఇదే బాట. స్క్రిప్టు రాయడంలో, సినిమాలు తీయడంలో అతను చాలా వేగం చూపిస్తుంటాడు.
కాబట్టే తక్కువ సమయంలో చాలా సినిమాలు చేసేశాడు. ఇప్పుడతను రికార్డు వేగంతో ఓ సినిమాను పూర్తి చేశాడు. అదే.. మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రానికి స్క్రిప్టును 20 రోజుల్లోనే పూర్తి చేసేశాడట మారుతి. ఇక షూటింగేమో నెల రోజుల్లో అయిపోయిందట. థియేటర్లు తెరుచుకుని ఉంటే ఈపాటికి సినిమాను కూడా రిలీజ్ చేసేవాళ్లం అంటున్నాడు మారుతి.
20 రోజుల్లో కథ రాసిన తాను.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని.. ఇంకో పది రోజులకు రిలీజ్ చేసేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు అతను ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా వెల్లడించాడు.
తన టీం తన టార్గెట్కు అనుగుణంగా అద్భుతంగా పని చేసిందని.. పక్కా ప్లాన్ ప్రకారం సినిమాను పూర్తి చేశామని అతను తెలిపాడు. ‘మంచి రోజులు వచ్చాయి’ ఏదో మామూలుగా రాసి తీసేసిన సినిమా కాదని.. ఈ టైంలో ఈ చిత్రం చాలా అవసరం అని చేసిందని.. నిజానికి ప్రకృతే తమతో ఈ సినిమా చేయించుకుందని మారుతి అన్నాడు.
కరోనా కారణంగా బాధల్లో ఉన్న ప్రేక్షకులకు ఇది ఒక మందు లాంటి సినిమా అని.. తన బలం కామెడీ కాబట్టి.. ఆ కామెడీ మందుతో జనాలకు ఉపశమనం ఇవ్వాలని అనుకున్నానని.. అందుకే ఈ సినిమాకు ‘లాఫింగ్ థెరపీ’ అని క్యాప్షన్ కూడా పెట్టానని మారుతి అన్నాడు.
ఈ చిత్రంలో చాలా చిత్రమైన పాత్రలు ఉంటాయని.. అవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని మారుతి ధీమా వ్యక్తం చేశాడు. ‘ఏక్ మిని కథ’ను నిర్మించిన యువి కాన్సెప్ట్స్ బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కింది. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించారు. గోపీచంద్తో తీస్తున్న ‘పక్కా కమర్షియల్’ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని మారుతి ఈ సినిమాను లాగించేయడం విశేషం.
This post was last modified on July 25, 2021 11:57 am
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…