Movie News

అనీల్ రావిపూడికి వెయిటింగ్ తప్పదా..?

ఈ జనరేషన్ యంగ్ హీరోలకంటే బిజీగా ఉన్నారు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. వరుస సినిమాలు ఒప్పుకుంటూ అడ్వాన్స్ లు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు అరడజను ప్రాజెక్ట్ లు ఆయన చేతిలో ఉన్నాయి. అవి కాకుండా మరో నలుగురైదుగురు నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ముందుగా తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు బాలయ్య. ‘అఖండ’ సినిమా పూర్తవ్వగానే.. గోపీచంద్ మలినేని సినిమాను పట్టాలెక్కిస్తారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు బాలయ్య ఆలోచన మారినట్లు సమాచారం. గోపీచంద్ సినిమా తరువాత పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలనుకుంటున్నారట. గతంలో వీరిద్దరూ కలిసి ‘పైసా వసూల్’ సినిమా చేశారు. అప్పటినుండి మరో సినిమా చేద్దామని అనుకుంటూనే ఉన్నారు. కానీ కుదరడం లేదు.

ఇప్పుడు పూరితో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూరితో సినిమా చేస్తున్నా అంటూ బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి పూరితో సినిమాకి మరికొంత సమయం పడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అతడి కోసం అనిల్ రావిపూడిని పక్కన పెడుతున్నారు బాలయ్య. అనిల్ చెప్పిన కథలో బాలయ్య చెప్పిన మార్పులు చేయడానికి సమయం పడుతుంది. పూరి కథల విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. ఆయన దగ్గర ఆల్రెడీ బాలయ్యకి సూటయ్యే రెండు, మూడు లైన్లు రెడీగా ఉన్నాయి. అందుకే ముందుగా పూరితో సినిమా పూర్తి చేయనున్నారు. 2022లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

This post was last modified on July 24, 2021 5:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

29 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

1 hour ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

1 hour ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

4 hours ago