విరాన్ ముత్తంశెట్టి.. టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న కొత్త హీరో. మామూలుగా చూస్తే ఇదేమంత విషయం కాదు. కానీ ఈ యంగ్ హీరో వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే ఆసక్తి కలుగుతుంది. అల్లు అర్జున్కు ఈ కుర్రాడు కజిన్ అవుతాడు. చాలా దగ్గరి చుట్టమేనట. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న భారీ చిత్రం ‘పుష్ప’ పోస్టర్ల మీద చూస్తే ‘ముత్తంశెట్టి మీడియా’ అనే పేరు కనిపిస్తుంది. ఇది విరాన్ కుటుంబ సంస్థే. తన సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇచ్చాడంటే బన్నీకి వీళ్లెంత దగ్గరివాళ్లో అర్థం చేసుకోవచ్చు.
విరాన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా.. బతుకు బస్టాండ్. ఐఎన్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ రోజే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అది చూస్తే సినిమా కథేంటో అంతగా అర్థం కాలేదు. హీరో అమ్మాయిల చుట్టూ తిరిగే జులాయి కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఆవారాగా తిరిగే అతను అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకోవడం.. అతణ్ని రౌడీ బ్యాచ్లు వెంటాడటం.. వాళ్లను అతను ఢీకొట్టడం లాంటి సన్నివేశాలు కనిపించాయి ట్రైలర్లో.
విరాన్ లుక్స్ పరంగా చాలా యావరేజ్గా ఉన్నాడు. యాక్టింగ్ స్కిల్స్ కూడా పెద్దగా కనిపించలేదు. ట్రైలర్లో వావ్ అనిపించే అంశాలు ఏమీ కనిపించలేదు. తమిళ నటుడు మైమ్ గోపి ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు. మిగతా ఆర్టిస్టులందరూ అంతగా పేరు లేని వాళ్లే. ట్రైలర్ మొత్తంలో ఆసక్తికరంగా అనిపించింది లాస్ట్ పంచే. “బతుకు బస్టాండా.. ఎవరిది ప్రొడ్యూసర్దా.. డైరెక్టర్దా” అని ఓ వ్యక్తి హీరోను అడిగితే.. “సినిమా చూసి టైటిల్ కరెక్టో కాదు అప్పుడు చెప్పు” అని విరాన్ బదులివ్వడం కనిపించింది. టైటిల్ చూసి జనాలు తనపై ఈ పంచ్ వేస్తారేమో అనిపించి.. తనపై తనే ట్రైలర్లో కౌంటర్ వేసుకున్నట్లుగా ఉందీ కుర్రాడు. మరి బన్నీ కజిన్కు ఈ సినిమా టాలీవుడ్లో ఎలాంటి ఆరంభం ఇస్తుందో చూడాలి.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…