విరాన్ ముత్తంశెట్టి.. టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న కొత్త హీరో. మామూలుగా చూస్తే ఇదేమంత విషయం కాదు. కానీ ఈ యంగ్ హీరో వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే ఆసక్తి కలుగుతుంది. అల్లు అర్జున్కు ఈ కుర్రాడు కజిన్ అవుతాడు. చాలా దగ్గరి చుట్టమేనట. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న భారీ చిత్రం ‘పుష్ప’ పోస్టర్ల మీద చూస్తే ‘ముత్తంశెట్టి మీడియా’ అనే పేరు కనిపిస్తుంది. ఇది విరాన్ కుటుంబ సంస్థే. తన సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇచ్చాడంటే బన్నీకి వీళ్లెంత దగ్గరివాళ్లో అర్థం చేసుకోవచ్చు.
విరాన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా.. బతుకు బస్టాండ్. ఐఎన్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ రోజే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అది చూస్తే సినిమా కథేంటో అంతగా అర్థం కాలేదు. హీరో అమ్మాయిల చుట్టూ తిరిగే జులాయి కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఆవారాగా తిరిగే అతను అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకోవడం.. అతణ్ని రౌడీ బ్యాచ్లు వెంటాడటం.. వాళ్లను అతను ఢీకొట్టడం లాంటి సన్నివేశాలు కనిపించాయి ట్రైలర్లో.
విరాన్ లుక్స్ పరంగా చాలా యావరేజ్గా ఉన్నాడు. యాక్టింగ్ స్కిల్స్ కూడా పెద్దగా కనిపించలేదు. ట్రైలర్లో వావ్ అనిపించే అంశాలు ఏమీ కనిపించలేదు. తమిళ నటుడు మైమ్ గోపి ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు. మిగతా ఆర్టిస్టులందరూ అంతగా పేరు లేని వాళ్లే. ట్రైలర్ మొత్తంలో ఆసక్తికరంగా అనిపించింది లాస్ట్ పంచే. “బతుకు బస్టాండా.. ఎవరిది ప్రొడ్యూసర్దా.. డైరెక్టర్దా” అని ఓ వ్యక్తి హీరోను అడిగితే.. “సినిమా చూసి టైటిల్ కరెక్టో కాదు అప్పుడు చెప్పు” అని విరాన్ బదులివ్వడం కనిపించింది. టైటిల్ చూసి జనాలు తనపై ఈ పంచ్ వేస్తారేమో అనిపించి.. తనపై తనే ట్రైలర్లో కౌంటర్ వేసుకున్నట్లుగా ఉందీ కుర్రాడు. మరి బన్నీ కజిన్కు ఈ సినిమా టాలీవుడ్లో ఎలాంటి ఆరంభం ఇస్తుందో చూడాలి.
This post was last modified on July 23, 2021 6:03 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…