తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా ‘నారప్ప’ను తెరకెక్కించారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించారు. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాను రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఒరిజినల్ వెర్షన్ చూడని ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతోంది. ఎమోషనల్ సీన్స్ లో వెంకీ పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. నిజానికి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఓటీటీకి ఇచ్చేశారు.
అయితే ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీగానే చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తం శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి ఈ సినిమాకి రూ.40 కోట్ల బిజినెస్ జరిగిందట. సినిమా ప్రొడక్షన్ కాస్ట్, రెమ్యునరేషన్లు తీసేస్తే.. నిర్మాతకు ఈ సినిమాతో రూ.17 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క సినిమాకి పదిహేడు కోట్లు లాభం అంటే మాములు విషయం కాదు. అందుకే సురేష్ బాబు కూడా ఓటీటీ డీల్ కు అంగీకరించినట్లు ఉన్నారు. వెంకీ కూడా ఈ సినిమాకి ఫ్యాన్సీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
‘నారప్ప’తో భారీ లాభాలు చవిచూసిన సురేష్ బాబు తన తదుపరి సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ముందుగా ‘దృశ్యం 2’ను విడుదల చేయనున్నారు. దీనికోసం హాట్ స్టార్ సంస్థ భారీ డీల్ ను ఆఫర్ చేసినట్లు సమాచారం. రానా నటించిన ‘విరాటపర్వం’ కూడా ఓటీటీలో వస్తుందని అంటున్నారు. కానీ దర్శకుడి వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. మరి ఈ సినిమా విషయంలో సురేష్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
This post was last modified on July 22, 2021 7:07 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…