ఓవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోబోతుంటే.. అంతకంటే ముందు విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా డిజిటల్లో రిలీజైంది. ఐతే దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీల్లో రిలీజవుతాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. నితిన్ సినిమా ‘మాస్ట్రో’ కూడా డిజిటల్ రిలీజ్కు డీల్ పూర్తయిందన్నది సమాచారం.
ఐతే చిత్ర బృందం మాత్రం ఆ విషయం చెప్పకుండా ప్రి రిలీజ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఒక ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
‘మాస్ట్రో’ డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ నిర్మించిన ఈ చిత్రానికి రూ.30 కోట్ల పై మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్కు మంచి లాభాలే వచ్చాయి ఈ చిత్రంతో. నితిన్ చివరి రెండు చిత్రాలు చెక్, రంగ్ దె నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. ‘మాస్ట్రో’ థియేటర్లలో రిలీజ్ అయి అటు ఇటు అయితే అతడి కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో మంచి లాభానికి డీల్ కుదరడంతో ఓకే చెప్పేశారు.
బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ ‘అంధాదున్’కు రీమేక్గా తెరకెక్కిన చిత్రమిది. నితిన్ ఇందులో జీవనాధారం కోసం అంధుడి వేషం వేసుకునే మ్యుజీషియన్గా కనిపించనున్నాడు. అతడి సరసన నభా నటేష్ నటించింది. ఒరిజినల్లో టబు చేసిన అత్యంత కీలకమైన పాత్రలో తమన్నా నటించింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ ‘మాస్ట్రో’ను రూపొందించాడు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…