Movie News

తెలుగు డైరెక్టర్ని నమ్మి డబ్బు పెడుతున్న బాలీవుడ్ హీరో

ఈ మధ్యకాలంలో చాలా మంది సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ కు వెళ్తున్నారు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసిన సందీప్ రెడ్డి అదే సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. మరో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తను రూపొందించిన ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ‘హిట్’ సినిమా డైరెక్టర్ శైలేష్ కూడా బాలీవుడ్ కు వెళ్లనున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో దర్శకుడు సంకల్ప్ రెడ్డి చేరారు.

చిన్నవయసులోనే దర్శకుడిగా మారాడు సంకల్ప్ రెడ్డి. విదేశాల్లో ఫిలిం మేకింగ్ కోర్స్ నేర్చుకొని తెలుగులో సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఆయన తీసిన ‘ఘాజీ’ సినిమా రికార్డులు సృష్టించింది. రెండో సినిమాగా ‘అంతరిక్షం’ తీశారు. అది పెద్దగా ఆడనప్పటికీ సంకల్ప్ ఇమేజ్ కి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఆ తరువాత నెట్ ఫ్లిక్స్ లో ‘పిట్టకథలు’ అనే వెబ్ ఫిల్మ్ లో ఓ స్టోరీ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తన మూడో సినిమాను బాలీవుడ్ లో తీయబోతున్నారు.

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఇందులో హీరోగా నటించనున్నాడు. నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించనున్నారు. తొలిసారి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. సంకల్ప్ చెప్పిన కథ విద్యుత్ కి నచ్చడంతో సినిమా నిర్మించడానికి అంగీకరించాడు. ఈ సినిమాకి ‘ఐబీ 71’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి!

This post was last modified on July 19, 2021 5:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులు కోరేవి వేరే ఉన్నాయి

అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…

18 minutes ago

`వ‌స్తావా.. రేటెంత‌..` అర్ధ‌రాత్రి మ‌హిళా ఐపీఎస్‌కు వేధింపులు!

భాగ్య‌న‌గ‌రం హైద‌రాబాద్‌లో మ‌హిళ‌ల దుస్థితి ఎలా ఉందో.. ఒంట‌రి మ‌హిళ‌ల ప‌ట్ల స‌మాజం ఎలా వ్య‌వ‌హరిస్తోందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసిన…

29 minutes ago

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

4 hours ago

ఏపీ హైకోర్టులో జడ్జి వర్సెస్ లాయర్.. సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వివాదం!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ…

5 hours ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

5 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

6 hours ago