ఈ మధ్యకాలంలో చాలా మంది సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ కు వెళ్తున్నారు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసిన సందీప్ రెడ్డి అదే సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. మరో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తను రూపొందించిన ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ‘హిట్’ సినిమా డైరెక్టర్ శైలేష్ కూడా బాలీవుడ్ కు వెళ్లనున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో దర్శకుడు సంకల్ప్ రెడ్డి చేరారు.
చిన్నవయసులోనే దర్శకుడిగా మారాడు సంకల్ప్ రెడ్డి. విదేశాల్లో ఫిలిం మేకింగ్ కోర్స్ నేర్చుకొని తెలుగులో సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఆయన తీసిన ‘ఘాజీ’ సినిమా రికార్డులు సృష్టించింది. రెండో సినిమాగా ‘అంతరిక్షం’ తీశారు. అది పెద్దగా ఆడనప్పటికీ సంకల్ప్ ఇమేజ్ కి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఆ తరువాత నెట్ ఫ్లిక్స్ లో ‘పిట్టకథలు’ అనే వెబ్ ఫిల్మ్ లో ఓ స్టోరీ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తన మూడో సినిమాను బాలీవుడ్ లో తీయబోతున్నారు.
బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఇందులో హీరోగా నటించనున్నాడు. నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించనున్నారు. తొలిసారి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. సంకల్ప్ చెప్పిన కథ విద్యుత్ కి నచ్చడంతో సినిమా నిర్మించడానికి అంగీకరించాడు. ఈ సినిమాకి ‘ఐబీ 71’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి!
మొన్న ఏడాది దీపావళి పండక్కు విపరీతమైన కాంపిటీషన్ ఉన్నా శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమా అమరన్ తెలుగులోనూ మంచి విజయం…
సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక…
2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు…
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…