ఈ మధ్యకాలంలో చాలా మంది సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ కు వెళ్తున్నారు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసిన సందీప్ రెడ్డి అదే సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. మరో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తను రూపొందించిన ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ‘హిట్’ సినిమా డైరెక్టర్ శైలేష్ కూడా బాలీవుడ్ కు వెళ్లనున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో దర్శకుడు సంకల్ప్ రెడ్డి చేరారు.
చిన్నవయసులోనే దర్శకుడిగా మారాడు సంకల్ప్ రెడ్డి. విదేశాల్లో ఫిలిం మేకింగ్ కోర్స్ నేర్చుకొని తెలుగులో సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఆయన తీసిన ‘ఘాజీ’ సినిమా రికార్డులు సృష్టించింది. రెండో సినిమాగా ‘అంతరిక్షం’ తీశారు. అది పెద్దగా ఆడనప్పటికీ సంకల్ప్ ఇమేజ్ కి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఆ తరువాత నెట్ ఫ్లిక్స్ లో ‘పిట్టకథలు’ అనే వెబ్ ఫిల్మ్ లో ఓ స్టోరీ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తన మూడో సినిమాను బాలీవుడ్ లో తీయబోతున్నారు.
బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఇందులో హీరోగా నటించనున్నాడు. నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించనున్నారు. తొలిసారి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. సంకల్ప్ చెప్పిన కథ విద్యుత్ కి నచ్చడంతో సినిమా నిర్మించడానికి అంగీకరించాడు. ఈ సినిమాకి ‘ఐబీ 71’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి!
This post was last modified on July 19, 2021 5:59 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…