Movie News

గాంధీని వదలని నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు రెండు రోజుల కిందట ట్విట్టర్లో పెద్ద వివాదానికే తెర తీశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా అభివర్ణించాడు. గాంధీని చంపడం నేరమే అయినా.. గాడ్సే దేశభక్తిని మాత్రం శంకించాల్సిన అవసరం లేదన్నది నాగబాబు మాట. కానీ నాగబాబు వ్యాఖ్యలు జనాలకు వేరే సంకేతాలు ఇచ్చాయి.
ఈ వ్యాఖ్యల్ని ప్రత్యర్థులు అవకాశంగా మలుచుకున్నారు. వీటిని జనసేనకు ముడిపెట్టి విమర్శలు చేశారు. జనసేన వర్గాల నుంచి కూడా ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో నాగబాబు తన ట్వీట్లపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. జనసేనకు సంబంధం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే నాగబాబు ఇంకా కూడా గాంధీని విడిచిపెట్టడం లేదు. లేటెస్టుగా గాంధీతో ముడిపెట్టి కొత్త టాపిక్ మీద ట్వీట్లు వేశారాయన.

కరెన్సీ నోట్లపై ఒక్క గాంధీ బొమ్మ మాత్రమే వేయడం కరెక్ట్ కాదని.. దేశంలో ఎంతోమంది గొప్ప నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారని.. వాళ్లందరూ తర్వాతి తరాలకు గుర్తుండాలంటే అందరి బొమ్మల్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని అభిప్రాయపడ్డారు నాగబాబు.

‘‘Indian కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అంటూ నాగబాబు ట్విట్టర్లో పేర్కొన్నాడు.

ఐతే ఈ వ్యాఖ్యలపై యధావిధిగా విమర్శలొచ్చాయి. గాంధీ మీద మీకింత వ్యతిరేకత ఎందుకని కొందరు నాగబాబును తిట్టిపోశారు. కొందరు మాత్రం నాగబాబు చెప్పిందాంట్లో తప్పేముందని.. ఆయన మంచి సూచనే చేశారని మద్దతుగా నిలిచారు.

This post was last modified on May 23, 2020 2:10 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

2 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

3 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

3 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

5 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

5 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

5 hours ago