Movie News

గాంధీని వదలని నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు రెండు రోజుల కిందట ట్విట్టర్లో పెద్ద వివాదానికే తెర తీశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా అభివర్ణించాడు. గాంధీని చంపడం నేరమే అయినా.. గాడ్సే దేశభక్తిని మాత్రం శంకించాల్సిన అవసరం లేదన్నది నాగబాబు మాట. కానీ నాగబాబు వ్యాఖ్యలు జనాలకు వేరే సంకేతాలు ఇచ్చాయి.
ఈ వ్యాఖ్యల్ని ప్రత్యర్థులు అవకాశంగా మలుచుకున్నారు. వీటిని జనసేనకు ముడిపెట్టి విమర్శలు చేశారు. జనసేన వర్గాల నుంచి కూడా ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో నాగబాబు తన ట్వీట్లపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. జనసేనకు సంబంధం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే నాగబాబు ఇంకా కూడా గాంధీని విడిచిపెట్టడం లేదు. లేటెస్టుగా గాంధీతో ముడిపెట్టి కొత్త టాపిక్ మీద ట్వీట్లు వేశారాయన.

కరెన్సీ నోట్లపై ఒక్క గాంధీ బొమ్మ మాత్రమే వేయడం కరెక్ట్ కాదని.. దేశంలో ఎంతోమంది గొప్ప నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారని.. వాళ్లందరూ తర్వాతి తరాలకు గుర్తుండాలంటే అందరి బొమ్మల్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని అభిప్రాయపడ్డారు నాగబాబు.

‘‘Indian కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అంటూ నాగబాబు ట్విట్టర్లో పేర్కొన్నాడు.

ఐతే ఈ వ్యాఖ్యలపై యధావిధిగా విమర్శలొచ్చాయి. గాంధీ మీద మీకింత వ్యతిరేకత ఎందుకని కొందరు నాగబాబును తిట్టిపోశారు. కొందరు మాత్రం నాగబాబు చెప్పిందాంట్లో తప్పేముందని.. ఆయన మంచి సూచనే చేశారని మద్దతుగా నిలిచారు.

This post was last modified on May 23, 2020 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎట్టకేలకు చెవిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు…

49 minutes ago

ఇప్పుడు కేసీఆర్ వంతు?

బీఆర్ఎస్ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.…

1 hour ago

లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న కీర్తి

గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సర్ప్రైజింగ్, సెలబ్రేటెడ్ వెడ్డింగ్స్‌లో కీర్తి సురేష్‌ది ఒకటని చెప్పాలి. కెరీర్ మంచి…

2 hours ago

నిజమైతే మాత్రం సాయిపల్లవికి ఛాలెంజే

అందరూ మర్చిపోయి ఎప్పుడో ఆలస్యంగా వస్తుందిలే అని భావిస్తున్న కల్కి 2 పేరు హఠాత్తుగా తెరమీదకు రావడంతో ఒక్కసారిగా ప్రభాస్…

2 hours ago

డిజిటల్ దురంధర్ మేజిక్ చేస్తాడా

ఇంకా అధికారికంగా ప్రకటించడం, ప్రమోషన్లు చేయడం లాంటివి జరగకపోయినా రేపటి నుంచి దురంధర్ ఓటిటి స్ట్రీమింగ్ జరగడం దాదాపు ఖాయమే.…

3 hours ago

అన్నగారంటే ఇంత నిర్లక్ష్యమా?

థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…

4 hours ago