టాలీవుడ్ గేయ రచయితల్లో ఒకరైన సుద్దాల అశోక్ తేజ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఆయనకు అలాంటి అనారోగ్యం ఏమీ లేదని, క్షేమంగా ఉన్నారని.. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వస్తున్న వార్తలు అబద్ధమని కూడా ఖండనలు వచ్చాయి. దీంతో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక అశోక్ తేజ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ తేజకు వరసకు అల్లుడైన ఉత్తేజ్ స్పందించాడు. తన మావయ్య ఆరోగ్య పరిస్థితిపై ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చాడు.
‘‘మా మావయ్య సుద్దాల అశోక్ తేజ గారు అనారోగ్యంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అది నిజమే. అయితే ఆయన హాస్పిటల్లో జాయినవుతున్నారు. రేపు (23) సాయంత్రం సర్జరీ ఉంది. తన ఫ్రెండ్తో మాటమాత్రంగా రక్తం అవసరం ఉంటుందేమో అని చెబితే.. అతను ఫేస్ బుక్లో పెట్టేశాడు. దాంతో సోషల్ మీడియా మొత్తం మామయ్య ఆరోగ్యం గురించి రకరకాలుగా రాస్తున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. రక్తం అవసరమైంది. వెంటనే నేను చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్కు ఫోన్ చేయడం.. వాళ్లు రక్తదాతల్ని పంపించడం జరుగుతోంది. మావయ్య మీద గౌరవంతో, ప్రేమతో ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగిన వారందరికీ చాలా థ్యాంక్స్. చిరంజీవి గారు కూడా ఫోన్ చేశారు. మామయ్యకు ఎలా ఉందని కనుక్కుని, వీలైతే ఆయనతో మాట్లాడించమని చెప్పారు. నేను వెంటనే మామయ్యతో మాట్లాడించాను. అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. మొత్తం సినీ పరిశ్రమే తనతో మాట్లాడినట్లుగా అనిపించిందని, ఎంతో ధైర్యంగా ఆసుపత్రికి వెళుతున్నానని మామయ్య చెప్పారు. సుద్దాల అశోక్ తేజగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనందరి అభిమానం, ప్రేమతో ఆయన సంతోషంగా బయటికి వచ్చి మళ్లీ బోలెడన్ని పాటలు రాస్తారని కోరుకుంటున్నా’’ అని ఉత్తేజ్ చెప్పాడు.
This post was last modified on May 23, 2020 1:01 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…