టాలీవుడ్ గేయ రచయితల్లో ఒకరైన సుద్దాల అశోక్ తేజ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఆయనకు అలాంటి అనారోగ్యం ఏమీ లేదని, క్షేమంగా ఉన్నారని.. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వస్తున్న వార్తలు అబద్ధమని కూడా ఖండనలు వచ్చాయి. దీంతో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక అశోక్ తేజ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ తేజకు వరసకు అల్లుడైన ఉత్తేజ్ స్పందించాడు. తన మావయ్య ఆరోగ్య పరిస్థితిపై ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చాడు.
‘‘మా మావయ్య సుద్దాల అశోక్ తేజ గారు అనారోగ్యంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అది నిజమే. అయితే ఆయన హాస్పిటల్లో జాయినవుతున్నారు. రేపు (23) సాయంత్రం సర్జరీ ఉంది. తన ఫ్రెండ్తో మాటమాత్రంగా రక్తం అవసరం ఉంటుందేమో అని చెబితే.. అతను ఫేస్ బుక్లో పెట్టేశాడు. దాంతో సోషల్ మీడియా మొత్తం మామయ్య ఆరోగ్యం గురించి రకరకాలుగా రాస్తున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. రక్తం అవసరమైంది. వెంటనే నేను చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్కు ఫోన్ చేయడం.. వాళ్లు రక్తదాతల్ని పంపించడం జరుగుతోంది. మావయ్య మీద గౌరవంతో, ప్రేమతో ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగిన వారందరికీ చాలా థ్యాంక్స్. చిరంజీవి గారు కూడా ఫోన్ చేశారు. మామయ్యకు ఎలా ఉందని కనుక్కుని, వీలైతే ఆయనతో మాట్లాడించమని చెప్పారు. నేను వెంటనే మామయ్యతో మాట్లాడించాను. అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. మొత్తం సినీ పరిశ్రమే తనతో మాట్లాడినట్లుగా అనిపించిందని, ఎంతో ధైర్యంగా ఆసుపత్రికి వెళుతున్నానని మామయ్య చెప్పారు. సుద్దాల అశోక్ తేజగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనందరి అభిమానం, ప్రేమతో ఆయన సంతోషంగా బయటికి వచ్చి మళ్లీ బోలెడన్ని పాటలు రాస్తారని కోరుకుంటున్నా’’ అని ఉత్తేజ్ చెప్పాడు.
This post was last modified on May 23, 2020 1:01 am
ఈ ఏడాది భారీ అంచనాలు మోస్తున్న సినిమాల్లో ది ప్యారడైజ్ చాలా కీలకం. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే…
బాలీవుడ్ నటులు తెలుగు సినిమాలు చేయడం కొత్తేమి కాదు. దశాబ్దాల నుంచి ఉన్నదే. కాకపోతే వాళ్ళు ప్రమోషన్లలో అంతగా కనిపించరు.…
మార్చి నుంచి అప్పుడు ఇప్పుడు అంటూ ఎదురు చూసిన మెగాస్టార్ 158 ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. ఏపీ డిప్యూటీ సిఎం…
వైసీపీ హయాంలో పథకాలను అమలు చేశారు. జగన్ చెప్పిన లెక్క ప్రకారం.. 2.5 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంచారు.…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయనగరం కోటకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, హుందాతనం ఉన్నాయి. పూసపాటి రాజుల రాజకీయ వారసత్వం ఎప్పుడూ ఒక…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు…