స్పోర్ట్స్ బయోపిక్.. గత దశాబ్ద కాలంలో బాలీవుడ్లో బాగా డిమాండ్ పెరిగిన జానర్. బాగ్ మిల్కా బాగ్, ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ లాంటి చిత్రాలు ఘనవిజయం సాధించడంతో క్రీడాకారుల జీవితాల ఆధారంగా వరుసబెట్టి బయోపిక్స్ తీసేస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మీద కూడా సచిన్ః ఎ బిలియన్ డ్రీమ్స్ అనే డాక్యుమెంటరీ టైపు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక క్రికెటర్లలో అందరూ చూడాలనుకునే బయోపిక్స్లో సౌరభ్ గంగూలీది కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. దాదా అభిమానులు అతడి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ దిశగా అడుగు పడింది. తన బయోపిక్ రాబోతున్నట్లు స్వయంగా గంగూలీనే వెల్లడించడం విశేషం.
తన బయోపిక్కు అంగీకారం తెలిపానని.. దీని గురించి చాలా రోజులుగా చర్చలు జరుగతున్నాయని.. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుందని.. దీని దర్శకుడు, ఇతర వివరాలు తర్వాత వెల్లడవుతాయని గంగూలీ చెప్పాడు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్తో గంగూలీ బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ దాదా పాత్రలో నటిస్తాడని బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో భారత క్రికెట్ కుదేలైన స్థితిలో జట్టు పగ్గాలు చేపట్టి.. దేశ క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన ఘనత గంగూలీదే. అప్పటిదాకా భయం భయంగా ఆడే భారత జట్టులో ధైర్యాన్ని నింపి.. దీటుగా ప్రత్యర్థులను ఎదుర్కొనేలా చేసి.. విదేశాల్లో అద్భుత విజయాలు అందించిన చరిత్ర దాదాది. తనదైన దూకుడుతో కెప్టెన్సీకి కొత్త అర్థం చెప్పి కోట్లాది అభిమానుల మనసులు గెలిచాడు. వ్యక్తిగత జీవితంలోనూ విశేషాలకు లోటు లేని దాదా మీద సినిమా సరిగ్గా తీస్తే అది బ్లాక్బస్టర్ కావడం ఖాయం.
This post was last modified on July 14, 2021 9:50 am
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…