టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది తమిళ నటులు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించేస్తున్నారు. దీంతో మన హీరోలు కూడా తెలుగు, తమిళ బైలింగ్యువల్ అని.. పాన్ ఇండియా సినిమాలంటూ హడావిడి మొదలుపెట్టారు. హీరో రామ్ కూడా రీసెంట్ గా ఓ బైలింగ్యువల్ కథను అంగీకరించారు. దర్శకుడు లింగుస్వామి రూపొందించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
రామ్ తొలిసారిగా ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడంతో ముందుగానే విలన్ గా తమిళ హీరోని తీసుకోవాలని భావించారు. ఆ లిస్ట్ లో చాలా మంది పేర్లను పరిశీలించారు. ఫైనల్ గా హీరో ఆర్యను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆర్యకు తెలుగునాట మంచి పేరే ఉంది. గతంలో ‘వరుడు’ సినిమాలో విలన్ గా కనిపించారు. అలానే ఆయన నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఆ విధంగా ఆర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇప్పుడు రామ్ సినిమాలో విలన్ గా దాదాపుగా ఆర్యనే తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ పాత్రకు ధీటుగా ఆర్య పాత్ర ఉంటుందట. ఆర్య సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారని చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…