Movie News

రామ్ కి విలన్ గా స్టార్ హీరో..?

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది తమిళ నటులు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించేస్తున్నారు. దీంతో మన హీరోలు కూడా తెలుగు, తమిళ బైలింగ్యువల్ అని.. పాన్ ఇండియా సినిమాలంటూ హడావిడి మొదలుపెట్టారు. హీరో రామ్ కూడా రీసెంట్ గా ఓ బైలింగ్యువల్ కథను అంగీకరించారు. దర్శకుడు లింగుస్వామి రూపొందించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

రామ్ తొలిసారిగా ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడంతో ముందుగానే విలన్ గా తమిళ హీరోని తీసుకోవాలని భావించారు. ఆ లిస్ట్ లో చాలా మంది పేర్లను పరిశీలించారు. ఫైనల్ గా హీరో ఆర్యను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆర్యకు తెలుగునాట మంచి పేరే ఉంది. గతంలో ‘వరుడు’ సినిమాలో విలన్ గా కనిపించారు. అలానే ఆయన నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఆ విధంగా ఆర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఇప్పుడు రామ్ సినిమాలో విలన్ గా దాదాపుగా ఆర్యనే తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ పాత్రకు ధీటుగా ఆర్య పాత్ర ఉంటుందట. ఆర్య సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారని చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

This post was last modified on July 13, 2021 7:13 am

Share

Recent Posts

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

20 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

2 hours ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago