టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది తమిళ నటులు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించేస్తున్నారు. దీంతో మన హీరోలు కూడా తెలుగు, తమిళ బైలింగ్యువల్ అని.. పాన్ ఇండియా సినిమాలంటూ హడావిడి మొదలుపెట్టారు. హీరో రామ్ కూడా రీసెంట్ గా ఓ బైలింగ్యువల్ కథను అంగీకరించారు. దర్శకుడు లింగుస్వామి రూపొందించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
రామ్ తొలిసారిగా ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడంతో ముందుగానే విలన్ గా తమిళ హీరోని తీసుకోవాలని భావించారు. ఆ లిస్ట్ లో చాలా మంది పేర్లను పరిశీలించారు. ఫైనల్ గా హీరో ఆర్యను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆర్యకు తెలుగునాట మంచి పేరే ఉంది. గతంలో ‘వరుడు’ సినిమాలో విలన్ గా కనిపించారు. అలానే ఆయన నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఆ విధంగా ఆర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇప్పుడు రామ్ సినిమాలో విలన్ గా దాదాపుగా ఆర్యనే తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ పాత్రకు ధీటుగా ఆర్య పాత్ర ఉంటుందట. ఆర్య సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారని చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on July 13, 2021 7:13 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…