టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు ఒప్పుకుంది. అవకాశాల కోసం అందరిలా ఆమె హాట్ ఫోటోషూట్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో ఈ బుట్టబొమ్మ ఇప్పుడు తన హాట్ నెస్ తో అదరగొడుతుంది. వరుస ఫోటోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
గత రెండు వారాలుగా ఆమె గ్యాప్ లేకుండా ఫోటోషూట్స్ తో ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో 14 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. రోజురోజుకి ఆ నెంబర్ పెరిగిపోతుంది. ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ బాగా సంపాదిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే సెలబ్రిటీలకు అంత ఆదాయం. బహుశా అందుకేనేమో పూజాహెగ్డే తన ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడింది.
వరుస ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని తన సోషల్ మీద అకౌంట్స్ లో షేర్ చేస్తుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో పూజా అందాలను చూడడానికి రెండు కళ్లు సరిపోవేమో అన్నట్లుగా ఉంది. ఈ ఫోటోపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోటోకి మిలియన్ కి మించి లైక్స్ వచ్చాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే విజయ్ సరసన ‘బీస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది.
వచ్చే వారం జూలై 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద క్రమంగా పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీమ్…
లెనిన్ సక్సెస్ మీట్ గుంటూరులో ఘనంగా జరిగింది. దశాబ్దంకు పైగా ఎదురు చూసిన విజయం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మొదట 80వ…
నదుల అనుసంధానం….ఈ మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నోటి వెంట కొన్ని వందల సార్లు విని ఉంటాం. ప్రాక్టికల్…
ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI వల్ల భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మీద పడబోయే తీవ్ర ప్రభావం…
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…