టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు ఒప్పుకుంది. అవకాశాల కోసం అందరిలా ఆమె హాట్ ఫోటోషూట్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో ఈ బుట్టబొమ్మ ఇప్పుడు తన హాట్ నెస్ తో అదరగొడుతుంది. వరుస ఫోటోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
గత రెండు వారాలుగా ఆమె గ్యాప్ లేకుండా ఫోటోషూట్స్ తో ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో 14 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. రోజురోజుకి ఆ నెంబర్ పెరిగిపోతుంది. ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ బాగా సంపాదిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే సెలబ్రిటీలకు అంత ఆదాయం. బహుశా అందుకేనేమో పూజాహెగ్డే తన ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడింది.
వరుస ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని తన సోషల్ మీద అకౌంట్స్ లో షేర్ చేస్తుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో పూజా అందాలను చూడడానికి రెండు కళ్లు సరిపోవేమో అన్నట్లుగా ఉంది. ఈ ఫోటోపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోటోకి మిలియన్ కి మించి లైక్స్ వచ్చాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే విజయ్ సరసన ‘బీస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది.
This post was last modified on July 12, 2021 10:05 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…