టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు ఒప్పుకుంది. అవకాశాల కోసం అందరిలా ఆమె హాట్ ఫోటోషూట్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో ఈ బుట్టబొమ్మ ఇప్పుడు తన హాట్ నెస్ తో అదరగొడుతుంది. వరుస ఫోటోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
గత రెండు వారాలుగా ఆమె గ్యాప్ లేకుండా ఫోటోషూట్స్ తో ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో 14 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. రోజురోజుకి ఆ నెంబర్ పెరిగిపోతుంది. ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ బాగా సంపాదిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే సెలబ్రిటీలకు అంత ఆదాయం. బహుశా అందుకేనేమో పూజాహెగ్డే తన ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడింది.
వరుస ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని తన సోషల్ మీద అకౌంట్స్ లో షేర్ చేస్తుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో పూజా అందాలను చూడడానికి రెండు కళ్లు సరిపోవేమో అన్నట్లుగా ఉంది. ఈ ఫోటోపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోటోకి మిలియన్ కి మించి లైక్స్ వచ్చాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే విజయ్ సరసన ‘బీస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…